గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే స్కూల్ సెలవులు ఇచ్చారు. అలాగే లోతట్టు ప్రాంతాలు మునకకి గురయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపైనే నదుల్లా నీరు పొటెత్తుతుంది. అక్కడక్కడ వాగులు, చెరువులు గండికొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపైన పడింది.
భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటకం కలిగింది. విమానాల రాకపోకలు నిర్వహించడానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వెళ్లే విమానాలు రద్దు చేశారు. దీనికి ప్రయాణికులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్-విశాఖపట్నం (6ఈ6408) మధ్య నడిచే విమాన సర్వీస్ విశాఖపట్నానికి రావాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖ పట్నానికి రావల్సిన ఈ విమాన సర్వీస్ రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం-హైదరాబాద్ (6ఈ779) మధ్య నడిచే విమాన సర్వీస్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన ఈ విమాన సర్వీస్ను కూడా రద్దు చేశారు.
బెంగళూరు-విశాఖపట్నం (6ఈ217) మధ్య నడిచే విమాన సర్వీస్ విశాఖపట్నానికి రావాల్సి ఉంది. బెంగళూరు నుంచి విశాఖపట్నానికి రావల్సిన ఈ విమాన సర్వీస్ను రద్దు చేశారు. చెన్నై-విశాఖపట్నం (6ఈ557) మధ్య నడిచే విమాన సర్వీస్ విశాఖపట్నానికి రావాల్సి ఉంది. చెన్నై నుంచి విశాఖపట్నానికి రావాల్సిన ఈ సర్వీస్ రద్దు చేశారు. విశాఖపట్నం-చెన్నై(6ఈ845) మధ్య నడిచే విమాన సర్వీస్ విశాఖపట్నం నుంచి వెళ్లాల్సి ఉంది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లాల్సిన ఈ విమాన సర్వీస్ రద్దు చేశారు.
హైదరాబాద్-విశాఖపట్నం (6ఈ879) మధ్య నడిచే విమాన సర్వీస్ విశాఖపట్నానికి రావాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖ పట్నానికి రావల్సిన ఈ విమాన సర్వీస్ రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం-హైదరాబాద్ (6ఈ6645) మధ్య నడిచే విమాన సర్వీస్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన ఈ విమాన సర్వీస్ను కూడా రద్దు చేశారు.
బెంగళూరు-విశాఖపట్నం (6ఈ6366) మధ్య నడిచే విమాన సర్వీస్ బెంగళూరు నుంచి విశాఖపట్నానికి రావాల్సి ఉంది. అయితే బెంగళూర్ నుంచి విశాఖపట్నానికి రావల్సిన ఈ విమాన సర్వీస్ను రద్దు చేశారు. విశాఖపట్నం-బెంగళూరు (6ఈ5309) మధ్య నడిచే విమాన సర్వీస్ విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. అయితే విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లే ఈ విమాన సర్వీస్ను రద్దు చేశారు.
మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ కోస్టు రైల్వే తెలిపింది. అందులో కొచ్చువేలి నుండి బరౌనికి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు, కోయంబత్తూరు నుండి దానాపూర్ మధ్య వన్ వే ప్రత్యేక రైలును నడపనున్నారు.
ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి కోయంబత్తూర్ నుండి దానాపూర్ వరకు వన్ వే ప్రత్యేక రైలును నడపాలని రైల్వే నిర్ణయించింది. కోయంబత్తూరు - దానాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ (06185) జులై 21న (ఆదివారం) రాత్రి 11:30 గంటలకు కోయంబత్తూరులో బయలుదేరుతుంది. ఆ రైలు మరుసటి రోజు రాత్రి 8:10 గంటలకు దువ్వాడ చేరుకుని , అక్కడ నుండి 8:15 గంటలకు బయలుదేరుతుంది. బుధవారం తెల్లవారుజామున 1:30 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.
ఈ రైలు ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్ తదితర రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ రైలులో 15 స్లీపర్ క్లాస్, 2 సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/దివ్యాంగజన్ కోచ్లు ఉన్నాయి.
ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి కొచ్చువేలి నుండి బరౌనికి ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. బరౌని - కొచ్చువేలి స్పెషల్ ఎక్స్ప్రెస్ (06092) బరౌని నుండి జులై 23 (మంగళవారం) రాత్రి 11ః30 గంటలకు బయలుదేరుతుంది. ఇది మూడో రోజు (శుక్రవారం) ఉదయం 5.25 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడి నుంచి 5:30 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు కొచ్చువేలి చేరుకుంటుంది.
కొచ్చువేలి - బరౌని స్పెషల్ ఎక్స్ప్రెస్ (06091) జులై 20న (శనివారం) ఉదయం 8 గంటలకు కొచ్చువేలిలో బయలుదేరుతుంది. ఆ రైలు మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 11.45 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడి నుండి 11:50 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 14:30 గంటలకు బరౌని చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైళ్లలో తొమ్మిది స్లీపర్ క్లాస్, 11 జనరల్ సెకండ్ క్లాస్, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/దివ్యాంగజన్ కోచ్లు ఉన్నాయి.
భువనేశ్వర్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12830) జులై 25న మధ్యాహ్నం 12:10 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరాల్సి ఉంది. అయితే గంట ఆలస్యంగా మధ్యాహ్నం 1ః10 గంటలకు బయలుదేరుతుంది.
పూరీ - గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22974) జులై 27న ఉదయం 11:15 గంటలకు పూరీలో బయలుదేరాల్సి ఉంది. అయితే 1ః30 గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరుతుంది.
భువనేశ్వర్ - తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22879) జులై 27న మధ్యాహ్నం 12:10 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరాల్సి ఉంది.అయితే గంట ఆలస్యంగా మధ్యాహ్నం 1ః10 గంటలకు బయలుదేరుతుంది.
విశాఖపట్నం - పలాస (07470) జులై 22, 25, 27 తేదీలలో విశాఖపట్నం నుండి బయలుదేరి శ్రీకాకుళం రోడ్లో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. పలాస - విశాఖపట్నం (07471) మెము పలాసకు బదులుగా జులై 22, 25, 27 తేదీలలో శ్రీకాకుళం రోడ్ నుండి బయలుదేరుతుంది. ప్రజలు దీన్ని గమనించి ప్రయాణాలు చేసుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ కోరారు.