కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకుంటున్నారా..? ఈ 7 విషయాలు తెలుసుకోండి-new ration card process begins in andhrapradesh know these seven key points ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకుంటున్నారా..? ఈ 7 విషయాలు తెలుసుకోండి

కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకుంటున్నారా..? ఈ 7 విషయాలు తెలుసుకోండి

ఏపీలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అయింది. మే 7వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ/వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో కొనసాగుతున్నాయి. ఇక మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ఆధారంగా కూడా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇదే విషయంపై ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది.

ప్రభుత్వం నిర్ణయంతో…. కొత్త రేషన్ కార్డులను పొందటమే కాకుండా…మార్పులు, చేర్పులకు కూడా అవకాశం లభించినట్లు అయింది. ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి కావటంతో… కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. అవెంటో ఇక్కడ తెలుసుకోండి…..

  1. కొత్త రేషన్ కార్డు : రేషన్ కార్డు పొందే వ్యక్తి కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తై ఉండాలి. ప్రజాసాధికార సర్వే అనగా హౌస్ హోల్డ్ మాపింగ్ లో తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయి ఉంటారో… ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి మాత్రమే అయ్యి ఉండాలి. ఇప్పటి వరకు ఎవరికైతే బియ్యం కార్డు లేదో…. ఆ వ్యక్తి వాళ్ల అమ్మ తరపున బియ్యం కార్డు లో కానీ అత్తగారి తరపు కార్డులో కానీ పేరు ఉండొద్దు. అలాంటి వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇస్తారు.
  2. బియ్యం కార్డులో పేర్లు జోడించడం : చిన్నపిల్లల్ని యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి. పెళ్లి అయిన వధువుని జోడించుట కోసం మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డులో భర్త పేరు ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు. ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ ఆ గ్రామానిది అయ్యి ఉండవలెను.
  3. బియ్యం కార్డు విభజన : బియ్యం కార్డు విభజించడానికి ముందు వారు ప్రజాసాధికార సర్వే లో సెపరేట్ గా ఉండాలి. లేనిచో విభజించుట కుదరదు.
  4. బియ్యం కార్డులో పేరు తొలగించుట : చనిపోయిన వ్యక్తిని మాత్రమే బియ్యం కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది.
  5. ఆధార్ సీడింగ్ కరెక్షన్: తప్పుగా ఉన్న ఆధార్ ని అలా వదిలేసి కొత్త ఆధార్ తో ముందుగా ప్రజాసాధికార సర్వే లో యాడ్ అయిన తరువాత మాత్రమే ఆధార్ సీడ్ చేస్తారు.
  6. అడ్రస్ చేంజ్ : ఆధార్ అడ్రస్ కచ్చితంగా ఆ సచివాలయ పరిధిలోని అడ్రస్ ఉండాలి.కుటుంబ పెద్ద వేలి ముద్రతో మాత్రమే ఇది చేయడానికి వీలవుతుంది.
  7. సరెండర్ రైస్ కార్డు : బియ్యం కార్డు వద్దనుకున్న వారు… రేషన్ కార్డుని సరెండర్ చేసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం