ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అయింది. మే 7వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ/వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో కొనసాగుతున్నాయి. ఇక మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ఆధారంగా కూడా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇదే విషయంపై ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది.
ప్రభుత్వం నిర్ణయంతో…. కొత్త రేషన్ కార్డులను పొందటమే కాకుండా…మార్పులు, చేర్పులకు కూడా అవకాశం లభించినట్లు అయింది. ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి కావటంతో… కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. అవెంటో ఇక్కడ తెలుసుకోండి…..
సంబంధిత కథనం