MP Vijayasai Reddy :బెంగళూరు ఆస్పత్రికి వైసీపీ ఎంపీ.. తారకరత్న ఆరోగ్యంపై ప్రకటన -mp vijayasai reddy visited taraka ratna at bengaluru narayana hrudayalaya ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Mp Vijayasai Reddy Visited Taraka Ratna At Bengaluru Narayana Hrudayalaya

MP Vijayasai Reddy :బెంగళూరు ఆస్పత్రికి వైసీపీ ఎంపీ.. తారకరత్న ఆరోగ్యంపై ప్రకటన

HT Telugu Desk HT Telugu
Feb 01, 2023 08:32 PM IST

mp vijayasai reddy visited Narayana Hrudayalaya: తారకరత్న చికిత్స పొందుతున్న బెంగళూరులోని ఆస్పత్రికి వచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... , మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని చెప్పారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (facebook)

Taraka Ratna Health Updates: సినీ నటుడు తారకరత్న మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బుధవారం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి విజయసాయిరెడ్డి వచ్చారు. తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలు బాగున్నాయని, మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని చెప్పారు విజయసాయిరెడ్డి. గుండెపోటు వచ్చిన రోజు 45 నిమిషాల పాటు మెదడకు రక్తప్రసరణ ఆగిపోవడంతో.. మెదడులో పైభాగం కొంత దెబ్బతిందని తెలిపారు. త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇక అసలు విషయానికి వస్తే తారకరత్న భార్య విజయసాయిరెడ్డికి దగ్గరి బంధువు అవుతారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి.. విజయసాయిరెడ్డికి స్వయానా మరదలి కూతురు. విజయసాయిరెడ్డి భార్య, తారకరత్న అత్తయ్య అక్కాచెల్లెళ్లు అవుతారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా ఆయన ఆస్పత్రికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న క్రమంలో... నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిదూరం నడిచిన తర్వాత గుండెపోటుతో పడిపోయారు. అనంతరం కుప్పంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం.. అదే రోజు అర్ధరాత్రి బెంగళూరుకు ఆయన్ను తరలించారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం