అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్ జి ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ రోజు ఎల్జీ యూనిట్ కు మాత్రమే కాదు - ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామని ప్రకటించారు.
రూ.5వేల కోట్లకు పైగా పెట్టుబడితో LG ఎలక్ట్రానిక్స్ ప్లాంట్.. ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ను తీసుకురావడమే కాకుండా ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తుందని నారా లోకేష్ చెప్పారు.
మేడ్ ఇన్ ఆంధ్రా నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు తమ జైత్రయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా ఎల్జీ శ్రీసిటీ యూనిట్ ఆవిష్కృతమైందని చెప్పారు.
పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై చంద్రబాబునాయుడు నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది. ఏపీ ప్రభుత్వం సులభతరమైన వ్యాపారానికి హామీ ఇవ్వడంమేగాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నట్టు లోకేష్ వివరించారు.
LG ఫ్యాక్టరీay అధునాతన గృహోపకరణాలైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు స్మార్ట్, ఇంధన -సమర్థవంతమైన సాంకేతికతతో ఉత్పత్తులను తయారు చేస్తారు.
ఒక స్మార్ట్ ఫ్యాక్టరీ, ఒక స్మార్ట్ రాష్ట్రం, ఒక స్మార్ట్ దేశం యొక్క సరికొత్త ప్రయాణం ఈ రోజు ప్రారంభమవుతుందని లోకేష్ చెప్పారు. . ఇది కేవలం తయారీ గురించి కాకుండా జీవన భవిష్యత్తును రూపొందించడం గురించి, ఉద్యోగాలను సృష్టించడం, మన యువతకు సాధికారత కల్పించడం, జీవితాలను మార్చడం కూడా చేస్తుందని చెప్పారు. ఎల్ జి ప్రధాన యూనిట్ దాదాపు 1,500 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పారు.
ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్జీ సిటీ నిర్మించాలని కోరారు. రాబోయే నాలుగేళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం తో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్యానికి తమ ద్వారాలను తెరిచే ఉంటుంది, సరికొత్త ఆవిష్కరణల కోసం, మార్పుకోసం ఆతృతగా ఎదురుచూస్తోందని చెప్పారు.
పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమిష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని కొనసాగిద్దామన్నారు. ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకున్న ఎల్ జి ఎలక్ట్రానిక్స్ కు కృతజ్ఞతలు చెప్పారు.
భారత్ లో కొరియా రాయబారి లీ సియాంగ్ హూ మాట్లాడుతూ... గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో తమ దేశానికి చెందిన కియా కంపెనీ ఏర్పాటైంది, ఇప్పుడు ఎల్జి వస్తోంది. రాష్ట్రంలో పారిశ్రమల ఏర్పాటుకు అన్నివిధాల సహాయ, సహకారాలు అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో LG ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్, భారత్ లో కొరియన్ రిపబ్లిక్ రాయబారి లీ సియాంగ్ హో, LG ఎలక్ట్రానిక్స్ హోం సొల్యూషన్స్ సిఈఓ జేచియోల్ లియు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత కథనం