అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఎదురుకాల్పులు జరిగాయి. కాకులమామిడి, కాంటవరం దగ్గర.. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. మావోయిస్టుల కోసం జల్లెడ బలగాలు పడుతున్నాయి. కాల్పులు జరిగిన దగ్గర ఎస్ఎల్ఆర్ మ్యాగ్జిన్, కమ్యూనికేషన్ పరికరాలు, విప్లవ సాహిత్యం, యూనిఫామ్, మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో కొండలు, అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో వారి కార్యకలాపాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాలు (ఏవోబీ) అని కూడా అంటారు. ఈ ప్రాంతాలు దట్టమైన అటవీ భూభాగం కలిగి ఉండటం వల్ల మావోయిస్టులకు అనుకూలంగా ఉంటాయి.
అయితే.. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ చర్యలు, పోలీసుల నిఘా కారణంగా మావోయిస్టుల కార్యకలాపాలు కొంతవరకు తగ్గాయి. అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో అప్పుడప్పుడు వారి ఉనికి కనిపిస్తూనే ఉంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి క్రమంగా క్షీణిస్తోంది. బలమైన ఎదురుదాడులు, అభివృద్ధి కార్యక్రమాలు, లొంగుబాట్లు వంటి కారణాల వల్ల వారి సంఖ్య, కార్యకలాపాలు తగ్గాయి.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి కొన్ని మారుమూల అటవీ ప్రాంతాల్లో మాత్రమే వారి కదలికలు కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో వారి ఉనికి దాదాపుగా లేదని చెప్పవచ్చు. గతంలో మావోయిస్టుల వల్ల తరచూ హింసాత్మక ఘటనలు జరిగేవి. ప్రస్తుతం అలాంటి ఘటనలు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దీంతో స్థానిక ప్రజలు మావోయిస్టులకు మద్దతు ఇవ్వడం తగ్గించారు. అలాగే పోలీసు బలగాలు కూడా మావోయిస్టులపై నిఘా ఉంచి, వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇటీవల మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య రెండుసార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ కొందరు మావోయిస్టులు తప్పించుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
సంబంధిత కథనం