ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 9 అంశాలు అజెండాగా మంత్రవర్గ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. "తల్లికి వందనం" కార్యక్రమానికి నిధుల విడుదలపై మంత్రులు చర్చించారు.