Kerala Couple Package : జీవితంలో ఒక్కసారైనా కేరళ అందాలు చూడాల్సిందే అంటారు పర్యాటకులు. భూతల స్వర్గంలా పిలిచే కేరళలో ప్రకృతి అద్భుతాలు ఎన్నో. బ్యాక్ వాటర్స్ లో బోటింగ్, తేయాకు తోటల్లో ట్రెక్కింగ్, హిల్స్ స్టేషన్లలో విహారం ఇలా ఎన్నో ప్రకృతి అందాలకు నెలవు కేరళ. కొత్తగా పెళ్లైన జంటలు కేరళను హనీమూన్ స్పాట్ గా ఎంచుకుంటారు. కేరళ టూరిజయం దక్షిణ కేరళలో కపుల్ ప్యాకేజీ అందిస్తోంది. రూ.2500-3500 ధరతో మూడు రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
డే 1 : మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు మున్నార్ లోని హోటల్ చెక్ ఇన్ చేస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మున్నార్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. సాయంత్రం స్థానికంగా షికారు వెళ్లవచ్చు, బ్లోసమ్ ఇంటర్నేషనల్ పార్క్ను సందర్శించవచ్చు. రాత్రికి మున్నార్లోని హోటల్ కు తిరిగి వచ్చి, రాత్రి భోజనం బస హోటల్ లోనే ఉంటాయి.
డే 2 : బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మళ్లీ మీ టూర్ ప్రారంభం అవుతుంది. అంతరించిపోతున్న పర్వత మేక జాతులకు నిలయమైన రాజామలయ్, నీలగిరి తహర్, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన అనముడిని సందర్శించవచ్చు. అనంతరం భోజనానికి మున్నార్ పట్టణానికి తిరిగి రావాలి. మధ్యాహ్న భోజనం తరువాత, మళ్లీ సందర్శనకు వెళ్తారు. మట్టుపెట్టి డ్యామ్లో బోటింగ్కు వెళ్తారు. ఆ తర్వాత ఎకో పాయింట్ వ్యూ ఉంటుంది. ఆ తర్వాత కుండలేలో షికారా టైప్ బోట్లలో బోటింగ్ సౌకర్యం కల్పిస్తారు. సాయంత్రం మున్నార్ లోని హోటల్ కి తిరిగి వెళ్లారు. రాత్రికి హోటల్ లోనే బస చేస్తారు.
డే 3 : బ్రేక్ ఫాస్ట్ చేసి కాసేపు విశ్రాంతి అనంతరం మున్నార్ పట్టణాన్ని సందర్శించవచ్చు. టీ, సుగంధ ద్రవ్యాలు, మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ కు తిరగి వచ్చి చెక్ అవుట్ చేయాలి.
కపుల్ ప్యాకేజీలో ఫ్లవర్ బెడ్ డెకరేషన్, క్యాండిల్ లైట్ డిన్నర్, ఫ్రూట్ బాస్కెట్, కేక్, బాడ్ యామ్ మిల్క్ అందిస్తారు.
కేరళ కపుల్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాలను ఈ లింక్ లో https://www.keralatourism.org/service-providers-packages తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం