కంచి కామకోటి పీఠాధిపతిగా గణేశశర్మ - అన్నవరం వాసికి అరుదైన గౌరవం-kanchi kamakoti peetam is all set to anoint ganesha sharma as its 71st pontiff ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కంచి కామకోటి పీఠాధిపతిగా గణేశశర్మ - అన్నవరం వాసికి అరుదైన గౌరవం

కంచి కామకోటి పీఠాధిపతిగా గణేశశర్మ - అన్నవరం వాసికి అరుదైన గౌరవం

కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరానికి చెందిన గణేశ శర్మ ఎంపికయ్యారు. ఈ మేరకు పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రకటన చేశారు. ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా ఆయనకు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు.

కంచి కామకోటి పీఠాధిపతిగా గణేశశర్మ

తమిళనాడులోని ప్రఖ్యాత కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరానికి చెందిన 27 ఏళ్ల పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న ఆయనకు సన్యాస దీక్షను ఇవ్వనున్నారు. ఈ మేరకు కంచి కామకోటి పీఠం నుంచి ప్రకటన వెలువడింది.

2006లో వేద అధ్యయన దీక్ష…

ధన్వంతరి, మంగాదేవిల పెద్ద కుమారుడైన గణేశశర్మ 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించారు. వేదాలు, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించారు. ఈయన కొన్ని రోజులు తెలంగాణ బాసరలో సేవలందించారు.

ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా గణేశశర్మకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్యులు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు. గణేశశర్మ(27) కాకినాడ జిల్లాలోని అన్నవరానికి చెందినవారు. పూర్తి పేరు… సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రావిడ్‌. ఆయన తండ్రి అన్నవరం ఆలయంలో పురోహితుడిగా ఉన్నారు. గణేశశర్మ 2006లో వేద అధ్యయన దీక్ష తీసుకున్నారు.కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. గణేశశర్మకు అరుదైన గౌరవం దక్కటం పట్ల…పలువురు హర్షం వ్యక్చం చేశారు.

2018లో జయేంద్ర సరస్వతి మహాసమాధి కావటంతో అప్పట్లో ఉత్తరాధికారిగా ఉన్న విజయేంద్ర సరస్వతి 70వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నుంచే ఆయనే కొనసాగుతూ వచ్చారు. గత ఆరేండ్లుగా ఉత్తరాధికారి ఎంపిక వాయిదా పడుతుండగా…. తాజాగా గణేశశర్మను ఎంపిక చేస్తూ ప్రకటన విడుదలైంది.

కంచి కామకోటి మఠాన్ని ఆది శంకర స్థాపించారు, తమిళనాడు కాంచీపురం నగరంలో ఉంది. ఆది శంకర భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో శాంతి, ప్రశాంతత యొక్క శోధన కోసం ఇక్కడకు వస్తుంటారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.