Janasena Kakinada MP : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ ఎంపీ(Kakinada MP) అభ్యర్థిని ప్రకటించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా 'టీ టైమ్'(Tea Time) యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(Tangella Uday Srinivas) పేరును పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. 'టీ టైమ్' యజమాని ఉదయ్ శ్రీనివాస్(Tea Time Uday Srinivas)... 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం దుబాయ్ లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి 'టీ టైమ్' ఔట్ లెట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 3,000కు పైగా టీ టైమ్ ఔట్లెట్లు ఉన్నాయి. టీటైమ్ తో ఏడాదికి రూ.300 కోట్ల టర్నోవర్ ఉంటుందని అంచనా. ఉదయ్ శ్రీనివాస్ ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ ఎంపీ బరిలో దించినట్లు తెలుస్తోంది.
పిఠాపురం(Pithapuram)నుంచి పోటీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్నారు. పిఠాపురం, గాజువాక, భీమవరం నియోజకవర్గాలు తనకు మూడు కళ్లలాంటివన్నారు. మంగళవారం మంగళగిరి పార్టీలో కార్యాలయంలో... పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా ఇక నుంచి పిఠాపురం నుంచే ఏపీ భవిష్యత్ దశ దిశా మార్చేందుకు పనిచేస్తానన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మిథున్ రెడ్డి బాగా బాగా తిరుగుతున్నారుగా, మీకేమైనా బంధువులు అవుతారా అంటూ పవన్ కల్యాణ్ సరదాగా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా(East Godavari) పిఠాపురం ఒక ప్రత్యేక స్థానమని పవన్ కల్యాణ్ అన్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేయమన్నారని, కానీ తాను ఆలోచించానన్నారు. పిఠాపురంలో కులాల ఐక్యత జరగాలన్నారు. ఇక్కడ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు.
పిఠాపురంలో(Pithapuram) తనను ఓడించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కానీ అక్కడి నుంచి లక్ష మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గం మార్చుకుందామని, ఒక ఎమ్మెల్యే తఎంత అభివృద్ధి చేయొచ్చో చేసి చూపిస్తానన్నారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీత(Vanga Geetha) విజయం సాధించారని గుర్తుచేశారు. ఆమెను జనసేనలో ఆహ్వానించారు. కేంద్ర నాయకత్వం తనను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరిందన్నారు. అయితే తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడమే ఇష్టమన్నారు. ముందు రాష్ట్రం కోసం పనిచేసి ఆ తర్వాత దేశం కోసం చేద్దామన్నారు.
సంబంధిత కథనం