IRCTC Araku Tour 2024 : అరకు ట్రిప్.. తక్కువ ధరలోనే 3 రోజుల టూర్- ఈ కొత్త ప్యాకేజీ చూడండి-irctc tourism 3 days araku tour package from visakhapatnam city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Araku Tour 2024 : అరకు ట్రిప్.. తక్కువ ధరలోనే 3 రోజుల టూర్- ఈ కొత్త ప్యాకేజీ చూడండి

IRCTC Araku Tour 2024 : అరకు ట్రిప్.. తక్కువ ధరలోనే 3 రోజుల టూర్- ఈ కొత్త ప్యాకేజీ చూడండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 11, 2024 12:41 PM IST

IRCTC Visakhapatnam Araku Tour 2024: అరకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన డేట్స్ తో పాటు ధరలను కూడా ప్రకటించింది. ఒక్కరోజులోనే ఈ టూర్ ముగుస్తుంది. ఫిబ్రవరి 16,2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

అరకు టూర్
అరకు టూర్ (IRCTC)

IRCTC Visakhapatnam Araku Tour 2024: ఈ ఏడాదిలో టూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం వేర్వురు ప్రదేశాలను చూసేందుకు ఆఫర్లతో కూడిన కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా అరకు అందాలను చూసేందుకు 3 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'VIZAG - ARAKU HOLIDAY PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విశాఖ నుంచి ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 16,2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ లో అరకులోని పలు ప్రాంతాలను చూపిస్తారు.

yearly horoscope entry point

ఫస్ట్ డే విశాఖ సిటీ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. విశాఖలని తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్ లను సందర్శిస్తారు. రాత్రి విశాఖలోనే బస చేస్తారు.

రెండో రోజు 8 గంటలకు అరకుకు వెళ్తారు. టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు. అరకు వ్యాలీకి చేరుకున్న తర్వాత... బస్సులో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ ను సందర్శిస్తారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖకు వచ్చే మార్గంలో సబ్ మెరైన్ మ్యూజియంను సందర్శిస్తారు. ఆ తర్వాత సిటీకి చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

అరకు టూర్ ప్యాకేజీ ధరలు:

Visakhapatnam Araku Tour Cost: ఈ టూర్ ప్యాకేజీ చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 17,715 గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 10,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 7980గా నిర్ణయించారు. చిన్న పిల్లలకు ఎక్స్ ట్రా బెడ్ తో కలిపి రూ. 5915గా ఉంది. వెళ్లే కోచ్ ను బట్టి ధరలు మారుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ - గుజరాత్ టూర్ ప్యాకేజీ

IRCTC Hyderabad Gujarat Tour Package 2024 : తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్ సీటీసీ టూరిజం. ‘SUNDAR SAURASHTRA’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. అహ్మదాబాద్, ద్వారక, రాజ్ కోట్, సోమ్‌నాథ్‌, వడోదరతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. ఫిబ్రవరి 14, 2024వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. షెడ్యూల్ చూస్తే…. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.

Day 1 : ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలకు పోరుబందర్ ఎక్స్ ప్రెస్(Train No. 20967) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 2 : ఉదయం 11 గంటలకు వడోదర స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ కి వెళ్లిన తర్వాత... స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శిస్తారు. రాత్రి వడోదరలోనే బస చేస్తారు.

Day 3 : హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కు వెళ్తారు. ఆ తర్వాత అహ్మాదాబాద్ కు పయనమవుతారు. అక్కడ ఉన్న అక్షరదామం ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి అహ్మాదాబాద్ లోనే బస చేస్తారు.

Day 4 : హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... సబర్మతి ఆశ్రయంకు చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్ కోట్ కు వెళ్తారు. మధ్యాహ్నం హెటల్ కి వెళ్లిన తర్వాత... వ్యాస్టన్ మ్యూజియంను సందర్శిస్తారు. గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి రాజ్ కోట్ లోనే బస చేస్తారు.

Day 5 : హోటల్ నుంచి ద్వారకా చేరుకుంటారు. ఆ తర్వాత జామ్ నగర్ కు వెళ్తారు. తిరిగి ద్వారకకు చేరుకొని రాత్రి ఇక్కడే బస చేస్తారు.

Day 6 : ద్వారకాదిశ్ ఆలయానికి వెళ్తారు. చెక్ అవుట్ అయిన తర్వాత... సోమ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం సమయానికి పోరుబందర్ కు చేరుకుంటారు. రాత్రి వరకు పోరుబందర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

Day 7 : అర్ధరాత్రి 12.20 గంటలకు ట్రైన్ సికింద్రాబాద్ బయల్దేరుతుంది.

Day 8 : ఉదయం 08.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

IRCTC Hyderabad Gujarat Tour Prices 2024: ఈ సుందర్ సౌరాష్ట్ర టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. డబుల్ షేరింగ్ కు రూ. 28280ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.27610 గా ఉంది. 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కూ రూ. 24,760గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్న పిల్లలకు కూడా వేర్వురు ధరలు ఉన్నాయి.టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

Whats_app_banner