Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే
Visakha Ramanarayanam IRCTC Package : విశాఖలోని ప్రముఖ దేవాలయాలతో పాటు సుందరమైన పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఐఆర్సీటీసీ రెండు రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన
Visakha Ramanarayanam IRCTC Package : విశాఖలోని పర్యటక ప్రదేశాల సంద్శనతో పాటు విజయనగరం శ్రీ రామనారాయణం ఆలయం పర్యటనకు ఐఆర్సీటీసీ 2 రోజులు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. విశాఖలోని ప్రముఖ ఆలయాలు, పర్యటక ప్రదేశాలను అతి తక్కువ ధరలో వీక్షించవచ్చు. రూ. 5885 కనీస ధరతో గ్లోరియస్ ఆంధ్ర విత్ శ్రీ రామనారాయం పేరిట ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ టూర్ లో సింహాచలం ఆలయం, తొట్ల కొండ బౌద్ధ సముదాయాలు, విజయనగరం శ్రీరామనారాయణం ఆలయాలతో పాటు సుందరమైన బీచ్ ను సందర్శించవచ్చు.
ఒక్కో వ్యక్తి ధర (01 నుంచి 03 వ్యక్తుల వరకు) :
క్లాస్ | సింగిల్ ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్ | చైల్డ్ వితవుట్ బెడ్ |
కంఫర్ట్ | రూ.13630 | రూ.7535 | రూ.5505 | రూ.4860 | రూ.3110 |
ఒక్కో వ్యక్తి ధర (04 నుంచి 06 వ్యక్తుల వరకు) :
క్లాస్ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్ | చైల్డ్ వితవుట్ బెడ్ |
కంఫర్ట్ | రూ.6330 | రూ.5885 | రూ.5180 | రూ.3815 |
ప్రయాణ వివరాలు
డే 1 టూర్
- ఉదయం 07:00 - విశాఖ రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం నుంచి పికప్ చేసుకుని హోటల్కి తీసుకెళ్తారు. హోటల్ లో చెక్ ఇన్ అయ్యి అల్పాహారం చేస్తారు.
- 09:00 నుంచి 09:30 వరకు - బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి రుషికొండ బీచ్కి వెళ్తారు. (14 కిమీ, 30 నిమిషాల ప్రయాణం).
- 09:30 నుంచి 11:30 వరకు - రుషికొండ బీచ్ సందర్శన
- 11:30 నుంచి 11:45 వరకు - రుషికొండ బీచ్ నుంచి తొట్లకొండ బౌద్ధ సముదాయానికి ప్రయాణం(6 కిమీ, 15 నిమిషాలు) అవుతారు.
- 11:45 AM నుంచి 12:15 PM వరకు - తొట్లకొండ బౌద్ధ సముదాయం సందర్శన
- 12:15 నుంచి 12:30 వరకు - తొట్లకొండ బౌద్ధ ఆలయం నుంచి పురాతన బావికొండకు ప్రయాణం అవుతారు.
- 12:30 PM నుంచి 1 :00 PM వరకు - బావికొండ పురాతన బౌద్ధ విహారం సందర్శన ఉంటుంది.
- 1:00 నుండి 2:00 వరకు - సమీపంలోని రెస్టారెంట్/హోటల్లో మధ్యాహ్న భోజనం(సొంత ఖర్చుతో)
- 2:00 నుండి 4:00 వరకు - మధ్యాహ్న భోజనం తర్వాత కైలాషగిరి హిల్స్ పార్క్ సందర్శన
- 4:00 నుండి 5:20 వరకు - కైలాషగిరి హిల్స్ పార్క్ నుంచి శ్రీరామనారాయణ దేవాలయం(విజయనగరం) సందర్శనకు ప్రయాణం మొదలవుతుంది. (50 కి.మీ., 1 గంట 20 నిమిషాల ప్రయాణం)
- 5:20 నుంచి 7:00 PM వరకు - శ్రీ రామనారాయణం ఆలయం సందర్శన, లేజర్ షో వీక్షిస్తారు.
- సాయంత్రం 7:00 నుంచి 8:30 వరకు - రామనారాయణం ఆలయం నుంచి విశాఖపట్నంలోని హోటల్కు తిరుగు ప్రయాణం అవుతారు. (52 కిమీ, 1 గంట 30 నిమిషాల ప్రయాణం). హోటల్లో డిన్నర్ చేసి రాత్రి బస చేస్తారు.
డే 2 టూర్
- ఉదయం 08:00 గంటలకు -బ్రేక్ ఫాస్ట్ తర్వాత, హోటల్ నుంచి చెక్-అవుట్ అయ్యి సింహాచలం ఆలయానికి ప్రయాణం అవుతారు.(18 కిమీ, 1 గంట ప్రయాణం)
- 09:00 - సింహాచలం దేవాలయానికి చేుకుంటారు.
- 09:00 నుంచి 11:00 వరకు - సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు.
- 11:00 నుంచి 11:45 వరకు - సింహాచలం దేవస్థానం నుంచి విశాఖ మ్యూజియం సందర్శనకు ప్రయాణం అవుతారు. (20 కిమీ, 45 నిమిషాలు).
- 11:45 నుంచి 12:15 వరకు - విశాఖ మ్యూజియంలో సందర్శన ఉంటుంది. (శుక్రవారం సెలవు)
- 12:15 నుంచి 12:20 వరకు - విశాఖ మ్యూజియం నుంచి మత్స్య దర్శిని చూసేందుకు బయలుదేరతారు (2 కిమీ, 5 నిమిషాలు).
- 12:20 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు - మత్స్య దర్శిని సందర్శన
- 1:00 నుంచి 2:00 వరకు - సమీపంలోని రెస్టారెంట్/హోటల్లో భోజనం (కస్టమర్ సొంత ఖర్చుతో)
- 2:00 నుంచి 3:00 వరకు - భోజనం తర్వాత ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం సందర్శిస్తారు.
- 3:00 నుంచి 4:00 వరకు- జలాంతర్గామి మ్యూజియం సందర్శన
- 4:00 నుంచి 4:30 వరకు - ఆర్కే బీచ్ సందర్శిస్తారు.
- 4:30 నుంచి 5:00 వరకు - ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం వద్ద డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.
గ్లోరియస్ ఆంధ్ర విత్ శ్రీ రామనారాయణం టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం