సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా పూరి, గయా, కాశీ అయోధ్య, ప్రయోగ్రాజ్ తదితర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలును ఐఆర్సీటీసీ తీసుకొచ్చింది. ఈ మేరకు విజయవాడ డివిజన్ ఏరియా మేనేజర్ ప్రకటన విడుదల చేశారు.
పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ సందర్శనార్థం వెళ్లే భక్తులకు కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు నడుపుతుంది. 10 రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన తీర్థయాత్రలు, చారిత్రక ప్రదేశాలు సందర్శన ఉంటుంది.
మొత్తం తొమ్మిది రాత్రులు, పది పగలతో ఈ యాత్ర ఉంటుంది. ఈ రైలు మే 8న సికింద్రాబాద్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి, తిరిగి మే 17న ప్రయాణమవుతుంది. ప్రయాణికులు ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలి. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, పాన్కార్డ్ వంటి ఫోటో గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
సికింద్రాబాద్లో బయలుదేరే రైలు భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబుబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా రైలు రాకపోకలు నిర్వహిస్తుంది.
పూరిలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయలో విష్ణుపాద ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవి ఆలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్ గర్హి, సరయు నది వద్ద హారతి, ప్రయోగ్రాజ్లో త్రివేణి సంగమం తదితర ప్రాంతాలను సందర్శించనుంది.
టీ, టిఫిన్, భోజనం, రవాణా, ప్రమాద బీమా అన్ని కలిపి టిక్కెట్ ధర ఒక్కొక్కొరికీ స్లీపర్ క్లాస్ పెద్దలకు రూ.16,800, పిల్లల (5-11 ఏళ్ల)కు రూ. 15,690, థర్ఢ్ ఏసీ పెద్దలకు రూ.26,600, పిల్లలకు రూ.25,300, సెకెండ్ ఏసీ పెద్దలకు రూ.34,900, పిల్లకు రూ.33,300 ఉంటుంది.
మొత్తం 718 సీట్లు (స్లీపర్ క్లాస్ సీట్లు-460, థర్డ్ ఏసీ సీట్లు- 206, సెకెండ్ ఏసీ సీట్లు-52) అందుబాటులో ఉన్నాయి.
అధికారిక వెబ్సైట్ డైరెక్ట్ లింక్ https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SCZBG41 ను ఉపయోగించి టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. టిక్కెట్లు బుకింగ్, ఇతర వివరాలకు 9281030714, 9281495848 ఫోన్ నెంబర్లను సంప్రదించొచ్చు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం