IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి తిరుమల ట్రిప్ - డేట్స్, తేదీలివే-irctc announced tirumala and tiruchanur tour from vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Irctc Announced Tirumala And Tiruchanur Tour From Vijayawada

IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి తిరుమల ట్రిప్ - డేట్స్, తేదీలివే

HT Telugu Desk HT Telugu
Jan 29, 2023 12:16 PM IST

IRCTC Tirupati Tour : తిరుమల వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం.. కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా తిరుచానూరు కూడా వెళ్లొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

విజయవాడ - తిరుమల టూర్
విజయవాడ - తిరుమల టూర్ (facebook)

IRCTC Tirumala Tour package: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ ప్రకటించింది. మూడు రోజులు రోజులు, రెండు రాత్రులు ప్యాకేజీ ఇది. విజయ్ గోవిందం(VIJAY GOVINDAM) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు వెళ్తారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 10వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. తిరుపతి,తిరుమల, తిరుచానూరు చూస్తారు. టూర్ షెడ్యూల్ చూస్తే...

DAY - 1 రైలు మెుదటి రోజు Samalkotలో సాయంత్రం 05:40 గంటలకు బయలుదేరుతుంది. రాజమండ్రి 06:20కి వస్తుంది. విజయవాడ 10:50, తెనాలి 11:20 చేరుకుంటుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.

DAY 2 - తిరుపతికి ఉదయం 05:10 గంటలకు చేరుకుంటారు. హోటల్‌(Hotel)కి తీసుకెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత శ్రీవారి దర్శనం కోసం వెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం 08:30 గంటలకు మెుదలవుతుంది. దర్శనం రద్దీని బట్టి ఉంటుంది. అనంతరం తిరుచానూరు ఆలయాన్ని సందర్శిస్తారు. 08:30 గంటలకు రైలు తిరుపతి రైల్వే స్టేషన్‌(Tirupati Railway Station) చేరుకుని.. తిరుగు పయనమవుతారు.

ఈ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్, కంఫర్ట్ క్లాస్ కోసం 3AC అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్, కంఫర్ట్ క్లాస్ రెండింటికీ తిరుపతిలో AC వసతి ఉంటుంది. తిరుమల(Tirumala)లో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆలయాల్లో సాధారణ దర్శనం కల్పిస్తారు. అల్పాహారం, టూర్ గైడ్ సర్వీస్, ప్రయాణపు బీమా అన్ని కలిపి ప్యాకేజీలోనే ఉంటాయి.

టికెట్ల రేట్లు..

కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీ కోసం రూ.5850, డబుల్ ఆక్యుపెన్సీ కోసం రూ.4720, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.4720, ఐదు నుంచి 11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ రూ.3810గా ఉంది. స్టాండర్ట్ కాసులో సింగిల్ ఆక్యుపెన్సీ రూ.4690, డబుల్ అయితే రూ.3560, ట్రిపుల్ రూ.3560, ఐదు నుంచి 11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ రూ.2650గా ఉంది. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితా చూడొచ్చు.

తిరుమల టూర్ ప్యాకేజీ ధరల వివరాలు
తిరుమల టూర్ ప్యాకేజీ ధరల వివరాలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి తిరుమల ప్యాకేజీ బుకింగ్ తో పాటు మరిన్ని టూర్ ప్యాకేజీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

WhatsApp channel