AP High Court: ఏపీ ఐపీఎస్ అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
AP High Court: ముంబై సినీ నటిని వేధింపులకు గురి ఫిర్యాదుపై నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఏసీపీ, సీఐ, అడ్వకేట్లకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ హైకోర్టు
AP High Court: ముంబై సినీ నటిపై వేధింపుల కేసులో విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్సార్ ఆంజనేయులును కూడా నిందితుడిగా పేర్కొన్నా ఆయన బెయిల్కు దరఖాస్తు చేయలేదు. మిగిలిన పోలీస్ అధికారులకు తాజాగా ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.