AP Pension Distribution : ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీకీ కీలక అప్డేట్ వచ్చింది. వరుసగా మూడు రోజులు పాటు బ్యాంకులకు సెలవు రావడంతో ఈనెల 29నే పెన్షన్ నగదును బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. అలాగే పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు పెన్షనర్లకు శుభాకాంక్షులు తెలియజేయాలని సూచించింది.
ఈ మేరకు సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కరుణ వాకటి సర్క్యులర్ జారీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏప్రిల్ 1న పెన్షన్ల పంపిణీ నగదు విత్డ్రా, ఇన్కార్పొరేషన్ వాయిస్ మెసేజ్ విషయం కొన్ని సూచనలు జారీ చేశారు. అలాగే పెన్షన్ పంపిణీపై కూడా కొన్ని సూచనలు చేశారు. పెన్షన్ పంపిణీ ఏప్రిల్ 1న ఉదయం 7.00 గంటలకు ప్రారంభం కావాలి. చాలా మంది పెన్షనర్లకు మొదటి రోజున పంపిణీ చేయాలి. మిగిలిపోయిన పెన్షన్లు రెండో రోజున అంటే ఏప్రిల్ 2న పంపిణీ చేయాలని సూచించారు.
వాస్తవానికి నెల చివరి బ్యాంకు పనిదినం రోజున సంబంధిత బ్యాంకు శాఖలలో నగదు అందుబాటులో ఉంచుతారు. దానిని విత్డ్రా చేసుకుని పెన్షనర్లకు ఒకటో తేదీన పంపిణీ చేసేవారు. అయితే ఈ నెల 30, 31 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలు. అలాగే ఏప్రిల్ 1 బ్యాంకు వార్షిక ముగింపు (యాన్యువల్ క్లోజింగ్ డే ) సెలవు. కానుక పెన్షన్ మార్చి 29 (శనివారం) సంబంధిత బ్యాంకు శాఖలలో పెన్షన్ నగదును అందుబాటులో ఉంచుతారు.
గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సెక్రటరీ (పీఎస్) , వెల్ఫేర్& ఎడ్యూకేషన్ అసిస్టెంట్ (డబ్ల్యూఈఏ), పట్టణ ప్రాంతాల్లో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ (డబ్ల్యూఏఎస్), వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ (డబ్ల్యూడబ్ల్యూడీఎస్) మార్చి 29న నగదు డ్రా చేయాలి. సంబంధిత పెన్షన్ డిస్బర్స్మెంట్ ఫంక్షనరీలకు వారికి కేటాయించిన పెన్షన్ల ప్రకారం నగదును అందజేయాలి. అన్ని పెన్షన్ డిస్బర్స్మెంట్ ఫంక్షనరీలు మార్చి 30, 31 తేదీల్లో నగదును సురక్షితంగా ఉంచాలి. ఏప్రిల్ 1 నుంచి పెన్షన్ల పంపిణీ చేయాలి.
పెన్షన్ డిస్బర్స్మెంట్ మొబైల్ అప్లికేషన్లో ఆడియో సందేశం (20 సెకన్లు) ప్రవేశపెట్టబడింది. వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పుడు, పెన్షన్ డిస్బర్స్మెంట్ ఫంక్షనరీలు పెన్షనర్లకు శుభాకాంక్షలు తెలియజేయాలి. పెన్షనర్ల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి, పంపిణీ ప్రక్రియలో పెన్షనర్ల కోసం ఆడియో సందేశం ప్లే చేయాలి. పైలట్ ప్రాతిపదికన మొబైల్ యాప్లో వ్యక్తిగత ఆడియో సందేశాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ రీతిలో పెన్షనర్ల సంతృప్తిని మెరుగుపరచడానికి పెన్షనర్ పేరు, మొత్తాన్ని అందులో నమోదు చేయాలి.
పెన్షన్ పంపిణీ కార్యనిర్వాహకులందరూ పైన పేర్కొన్న సూచనలను పాటించాలని, పెన్షనర్లు పూర్తిగా సంతృప్తి చెందేలా పెన్షన్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. మార్చి 29న నగదు విత్డ్రా, నగదు భద్రత, ఆడియో సందేశంపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచనలు జారీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సెర్ప్ సీఈవో సూచించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం