Global Investment Summit :కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించాం - సీఎం జగన్
- Global Investment Summit Updates 2023: విశాఖ వేదికగా తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండవ రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఎంవోయూలపై సంతకాలతో ప్రారంభమైంది. 10.30 గంటలకు ప్రముఖ ఇండో అమెరికన్ మ్యుజీషియన్ కర్ష్ కాలే బ్యాండ్ ప్రదర్శన పూర్తి అయింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. శనివారం మొత్తం 8 రంగాలపై సెషన్లు ఉండనున్నాయి. తొలి రోజు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కార్పొరేట్ దిగ్గజ సంస్థలు రూ.11,87,756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
- Global Investment Summit Updates 2023: విశాఖ వేదికగా తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండవ రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఎంవోయూలపై సంతకాలతో ప్రారంభమైంది. 10.30 గంటలకు ప్రముఖ ఇండో అమెరికన్ మ్యుజీషియన్ కర్ష్ కాలే బ్యాండ్ ప్రదర్శన పూర్తి అయింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. శనివారం మొత్తం 8 రంగాలపై సెషన్లు ఉండనున్నాయి. తొలి రోజు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కార్పొరేట్ దిగ్గజ సంస్థలు రూ.11,87,756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
(1 / 5)
జీఐఎస్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతమన్నారు. ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు..
(2 / 5)
సదస్సులో రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడారు. ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారిందన్నారు. ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయన్న ఆయన.. పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయని చెప్పారు.
(3 / 5)
ఐఎస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు: తెలిపారు సీఎం జగన్. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందన్న ఆయన… కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించామన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
(4 / 5)
సదస్సులో రెండో రోజైన శనివారం( ఏపీ ప్రభుత్వంతో పలు కంపెనీలు అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి పలు ప్రతిష్టాత్మక కంపెనీలు. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు