కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు మృతి-four people from ap die in road accident in karnataka ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన గోడను వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హిందూపురానికి చెందిన నాగభూషణ్‌, నాగరాజు, సోమ, మురళిగా గుర్తించారు. హిందూపురం నుంచి కర్ణాటకలోని యాద్గిర్‌ జిల్లా షహర్‌పూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి (istockphoto)

శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏపీ వాసులు మృతి చెందారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. హిందూపూరం మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

బొలెరో పికప్ వాహనంలో ప్రయాణిస్తూ.. యాద్గిర్ జిల్లాలోని షాపూర్ వైపు వెళుతున్నారు. ఆ వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి అమరాపుర క్రాస్ సమీపంలోని వంతెనను ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో వాహనంలోని నలుగురు ప్రయాణికులు నాగరాజ్, సోమ, నాగభూషణ్, మురళి మరణించారు. డ్రైవర్ ఆనంద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గబ్బూర్ పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.