సింహాచలం ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం.. గోడ కూలడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దంపతులు మృతి-four of a family die in simhachalam accident software engineer couple dies after wall collapses ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సింహాచలం ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం.. గోడ కూలడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దంపతులు మృతి

సింహాచలం ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం.. గోడ కూలడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దంపతులు మృతి

Sarath Chandra.B HT Telugu

సింహాచలం ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటం అందరిని కలిచి వేసింది. విశాఖపట్నం చెందిన దంపతులతో పాటు వారి సమీప బంధువులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. హెచ్‌సీఎల్‌లో పనిచేస్తున్న మహేష్‌తో పాటు అతని భార్య శైలజ ప్రనాలు కోల్పోయారు.

సింహాచలం ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురి మృతి

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తులపై గోడ కూలిన దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

సింహాచలం ఆలయ ఘటనా స్థలంలో ఏడుగురు చనిపోగా ఆస్పత్రిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వద్ద గల ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యుల సహాయంతో వారి వివరాలను అధికారులు వెల్లడించారు.

ప్రమాదంలో మృతి చెందిన వారిలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అడవివరం ప్రాంతానికి చెందిన ఎడ్ల వెంకట్రావు (48), తూర్పుగోదావరి జిల్లా మాచవరం, అంబాజి పేటకు చెందిన ఇంటిరియర్ డిజైనర్‌ పత్తి దుర్గా స్వామీ నాయుడు (32), కుమ్మపట్ల మణికంఠ ఈశ్వరరావు (28), హెచ్ బీ కాలనీ వేంకోజిపాలెం నివాసి గుజ్జరి మహాలక్ష్మి (65), హెచ్ బి కాలనీ ఉమా నగర్ ప్రాంతానికి చెందిన పైలా వెంకట రత్నం (45), మధురవాడ చంద్రపాలెం నివాసి పిల్లా మహేష్(30) లు గా గుర్తించారు.

మహేష్ ‍‍‍హెచ్‌సీఎల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.ఈ ఘటనలో మహేష్‌ భార్య పిల్లా శైలజ(29) కూడా మృతి చెందారు. శైలజ మధురవాడలోని ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నారు.

ఒకే కుటుంబంలో నలుగురు మృతి…

సింహాచలం ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం తిలకిద్దామని భావించిన వారిని గోడ రూపంలో మృత్యువు కబళించింది.

నగరంలోని హెచ్‌బి కాలనీ ప్రాంతానికి చెందిన పైలా వెంకట రత్నం, కుమార్తె శైలజ, అల్లుడు ఉమ మహేశ్వర రావు, పైల వెంకట రత్నం మేనత్త గుజ్జరి మహాలక్ష్మి దుర్ఘటనలో మృతి చెందారు. ఏడుగురి మృతదేహాలు కేజీహెచ్ మార్చురీకి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో కేజిహెచ్ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు.

సింహాచలం ఘటనలో మృతిచెందిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)గా ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం