తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఐదంతుస్తుల భవనం పై నుంచి పడటంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని బొటతొట్టి శ్రీనివాసులు, వసంత్, కె.శ్రీనివాసులుగా గుర్తించారు. తుడా క్వార్టర్స్ లో హెచ్ఐజీ భ వనాన్ని నిర్మిస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తూ ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయారు. తిరుపతి మంగళంలో ఈ ఘటన జరిగింది. భవన నిర్మాణ కార్మికులు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.