తిరుపతిలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి-fatal accident in tirupati three workers die after falling from under construction building ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుపతిలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

తిరుపతిలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

Sarath Chandra.B HT Telugu

తిరుపతిలోని మంగళం ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఐదంతస్తుల భవనంపై నుంచి పడటంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

ఐదంతస్తుల భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి (ప్రతీకాత్మక చిత్రం)

తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఐదంతుస్తుల భవనం పై నుంచి పడటంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని బొటతొట్టి శ్రీనివాసులు, వసంత్, కె.శ్రీనివాసులుగా గుర్తించారు. తుడా క్వార్టర్స్‌ లో హెచ్‌ఐజీ భ వనాన్ని నిర్మిస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తూ ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయారు. తిరుపతి మంగళంలో ఈ ఘటన జరిగింది. భవన నిర్మాణ కార్మికులు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.