Eluru News : ఏలూరు జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాసలీలలు బయపడ్డాయి. విధుల సమయంలో ఓ మహిళతో అసభ్యకరరీతిలో ఉద్యోగి దొరికిపోయాడు. తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుందని సబ్ స్టేషన్ కు వచ్చిన స్థానికులకు ఉద్యోగి రాసలీలలు కనిపించాయి. దీంతో వాళ్లు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ లో గంగు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి షిఫ్ట్ ఆపరేటర్గా చేస్తున్నాడు. తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు సబ్ స్టేషన్ కు ఫోన్ చేశారు. అయితే ఫోన్ చేసిన ఎవరూ తీయకపోవడంతో కొందరు బుధవారం తెల్లవారుజామున స్థానికులు సబ్ స్టేషన్ కు వెళ్లారు. డ్యూటీ సమయంలో మహేశ్వర్ రెడ్డి మద్యం తాగి ఓ మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన స్థానికులు చూసి ఫొటోలు, వీడియోలు తీశారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో ఇలాంటి పనులేంటని అతడిని ప్రశ్నించారు. విద్యుత్ ఆపరేటర్ మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు మహేశ్వర్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
నిజామాబాద్లోని ఓ స్కాన్ సెంటర్లో టెక్నీషియన్ దారుణానికి తెగబడ్డాడు. వైద్య పరీక్షల కోసం వచ్చే మహిళల్ని రహస్యంగా చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డాడు. స్కానింగ్ కోసం వచ్చే మహిళలు, యువతులను రహస్యంగా చిత్రీకరించాడు. మహిళలు వైద్య పరీక్ష చేస్తుండగా అర్ధనగ్నంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించాడు. ఆత తర్వాత వాటిని చూపించి వారిని బెదిరించే వాడు. ఈ క్రమంలో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో అతని నిర్వాకం బయటపడింది. మహిళల్ని బెదిరిస్తున్న నిజామాబాద్లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్పై పోలీసులు నిఘా పెట్టడంతో అతని ఆకృత్యాలు బయటపడ్డాయి. బాధితుల్ని బెదిరించడంతో పాటు కొన్ని వీడియోలను మిత్రులకు షేర్ చేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఫొటోల్లో ఉన్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు స్కాన్ సెంటర్ ఉద్యోగి ఫొటోలు తీసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ స్కాన్ సెంటర్ అనుమతులు రద్దు చేయాలని, ఘటనపై వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశించారు. ఈ ఘటనలో బాధితులు ఎవరు ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.