Elephant Died In Chittoor : ఆకలితో వచ్చిన ఏనుగు.. కరెంట్ తీగలు తగిలి
Elephants In Chittoor : చిత్తూరు జిల్లా వి.కోట మండలం నాగిరెడ్డిపల్లి వద్ద అటవీ ప్రాంతానికి సమీపంలో ఓ ఏనుగు చనిపోయింది. పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తాకడంతో ఏనుగు మృతి చెందింది.
అటవీ విస్తీర్ణం తగ్గుతుంటే.. అడవి జీవులు ఆహారం కోసం అరణ్యం నుంచి జనావాసాలలోకి వచ్చేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ప్రాణాలను పొగొట్టుకుంటున్నాయి. ఆకలితో అడవి వదిలి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు(Elephant).. కరెంట్ తీగలు తగిలి చనిపోయింది. మేత కోసం పొలాల్లోకి వెళ్లిన ఏనుగు కరెంట్ షాక్(Electric Shock)కు గురై చనిపోయింది. ఈ విషాద ఘటన చిత్తూరు(Chittoor) జిల్లా వీకోట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. పొలంలో ఏనుగు పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల కారణంగా ఏనుగు చనిపోయినట్టుగా గుర్తించారు.
ట్రెండింగ్ వార్తలు
30 సంవత్సరాల వయస్సు గల ఒంటరి మగ ఏనుగు రాత్రిపూట(Night Time) పొలం చుట్టూ తిరుగుతున్నట్లు ఓ ఫారెస్ట్ అధికారి(Forest Officer) చెప్పారు. అయితే అదే పొలంలో అడవి పందులు పొలాల్లోకి చొరబడకుండా కంచె ఏర్పాటు చేసి కరెంట్ పెట్టారు. ఉదయం ఏనుగు మృతదేహాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ(Forest Department)కు సమాచారం అందించారన్నారు. డీఎఫ్ఓ, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి పోస్టుమార్టం నిర్వహించారు.
ఇక్కడి ఎస్వీ జూలాజికల్ పార్క్ (తిరుపతి)కి చెందిన వెటర్నరీ వైద్యులు అక్కడికక్కడే శవపరీక్ష నిర్వహించి, సేవా పంచనామా నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో అడవి ఏనుగుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పొలం చుట్టూ ఉన్న తీగ కంచె ప్రధాన సరఫరాకు అనుసంధానించి ఉంది. దీని వల్ల ప్రజలకు కూడా ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పొలం యజమానిపై కేసు నమోదు చేశామని డీఎఫ్ఓ(DFO) అన్నారు.
మరోవైపు చాలా ప్రాంతాల్లో పొలంలో పనిచేస్తున్న వారిపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతున్నాయని.., భయంతో పొలం పనులకు వెళ్లడం లేదని రైతులు అంటున్నారు పొలాలు, అరటి తోటలు ధ్వంసం చేస్తున్నాయంటున్నారు.