ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం - రంగంలోకి ఈడీ..!-ed registers money laundering case to probe alleged liquor scam during previous ycp govt in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం - రంగంలోకి ఈడీ..!

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం - రంగంలోకి ఈడీ..!

ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై ఈడీ ఆరా తీసింది. అంతేకాకుండా మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది.

ఏపీ మద్యం కుంభకోణం కేసు - రంగంలోకి ఈడీ

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు సిట్ విచారణ కొనసాగుతుండగా…. మరోవైపు ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. మద్యం కుంభకోణంపై తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

రంగంలోకి ఈడీ…!

వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ ఏర్పాటైంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా… కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే…ఎంట్రీ ఇచ్చిన ఈడీ….. గురువారం కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేసింది. 2024 సెప్టెంబర్ లో ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదైంది.

సిట్ చీఫ్ కు లేఖ….

మరోవైపు లిక్కర్ కేసుకు సంబందించిన వివరాలను అందజేయాలని సిట్‌ చీఫ్‌ కు ఈడీ లేఖ రాసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కేసు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొంది. ఎఫ్ఐఆర్ కాపీ పూర్తి వివరాలను కోరింది.ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు…. రిమాండ్ రిపోర్టులను ఇవ్వాలని ప్రస్తావించింది.

ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో….. మద్యం ఏజెంట్లతో పాటు విక్రేతలు తదితరులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ప్రభుత్వ అధికారుల ప్రమేయాన్ని కూడా ఈడీ పరిశీలించనుంది. చత్తీస్ గఢ్, బీహార్ లలో మద్యం వ్యాపారంలో జరిగిన అవకతవకలపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం