ఏపీ ఈసెట్ 2025 హాల్ టిక్కెట్లు మే 1వ తేదీన విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఈ సెట్ ప్రవేశ పరీక్షకు 35,187 దరఖాస్తులు అందినట్టు ఈసెట్ 2025 కన్వీనర్ వివరించారు. బిటెక్ రెండో ఏడాది కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ, తెలంగాణలో 35,187 దరఖాస్తు చేసుకున్నారుని ఈ సెట్ నిర్వాహక కమిటీ చైర్మన్, అనంతపురం జేఎ న్టీయూ వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు తెలిపారు.
ఈ సెట్ పరీక్ష కోసం ఏపీలో 109, హైదరాబాద్లో ఒకటి మొత్తం 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. , మే 1వ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ సూచించారు. ఈసెట్ పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలో మే 6న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఏపీ ఈసెట్ పరీక్షకు మొత్తం 35,187 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతిలేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, క్యాలి క్యులేటర్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ ఉంటే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
https://cets.apsche.ap.gov.in/