రేపటి నుంచి ఈసెట్‌ హాల్‌ 2025టిక్కెట్లు విడుదల.. మే 6న ఎంట్రన్స్‌ టెస్ట్‌.. ఏర్పాట్లు పూర్తి-ecet hall 2025 tickets released from may 1st entrance test on may 6th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రేపటి నుంచి ఈసెట్‌ హాల్‌ 2025టిక్కెట్లు విడుదల.. మే 6న ఎంట్రన్స్‌ టెస్ట్‌.. ఏర్పాట్లు పూర్తి

రేపటి నుంచి ఈసెట్‌ హాల్‌ 2025టిక్కెట్లు విడుదల.. మే 6న ఎంట్రన్స్‌ టెస్ట్‌.. ఏర్పాట్లు పూర్తి

Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ 2025 హాల్‌ టిక్కెట్లు మే 1న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ సెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అనంతపురం జేఎన్‌టీయూ ప్రకటించింది. డిప్లొమా, బిఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు బిటెక్‌ రెండో ఏడాది ప్రవేశాల కోసం ఈసెట్‌ నిర్వహిస్తున్నారు.

మే1న ఈసెట్‌ 2025 హాల్‌ టిక్కెట్ల విడుదల

ఏపీ ఈసెట్‌ 2025 హాల్‌ టిక్కెట్లు మే 1వ తేదీన విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఈ సెట్ ప్రవేశ పరీక్షకు 35,187 దరఖాస్తులు అందినట్టు ఈసెట్‌ 2025 కన్వీనర్‌ వివరించారు. బిటెక్‌ రెండో ఏడాది కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ, తెలంగాణలో 35,187 దరఖాస్తు చేసుకున్నారుని ఈ సెట్ నిర్వాహక కమిటీ చైర్మన్, అనంతపురం జేఎ న్టీయూ వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు తెలిపారు.

ఈ సెట్‌ పరీక్ష కోసం ఏపీలో 109, హైదరాబాద్‌లో ఒకటి మొత్తం 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. , మే 1వ తేదీ నుంచి ఆన్లైన్‌లో హాల్‌ టిక్కెట్లు డౌన్‌ లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్‌ సూచించారు. ఈసెట్‌ పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలో మే 6న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు.

మొత్తం 35,187 దరఖాస్తులు

ఏపీ ఈసెట్ పరీక్షకు మొత్తం 35,187 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతిలేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, క్యాలి క్యులేటర్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ ఉంటే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

https://cets.apsche.ap.gov.in/

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.