అమ్మాయిలు డిఎస్సీ2025కు దరఖాస్తు చేసేపుడు ఈ విషయం అసలు మరువకండి.. ఆ తర్వాత మార్చడం కుదరదు… ముఖ్యమైన అంశాలివే…-dont forget this when applying for dsc 2025 it cannot be changed later ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అమ్మాయిలు డిఎస్సీ2025కు దరఖాస్తు చేసేపుడు ఈ విషయం అసలు మరువకండి.. ఆ తర్వాత మార్చడం కుదరదు… ముఖ్యమైన అంశాలివే…

అమ్మాయిలు డిఎస్సీ2025కు దరఖాస్తు చేసేపుడు ఈ విషయం అసలు మరువకండి.. ఆ తర్వాత మార్చడం కుదరదు… ముఖ్యమైన అంశాలివే…

Sarath Chandra.B HT Telugu

ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రెండు రోజుల క్రితం విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైంది. ఈ క్రమంలో డిఎస్సీ 2025కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల్లోనే 21వేల మంది డిఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. డిఎస్సీకు అప్లై చేసే మహిళకలకు ప్రబుత్వం కీలక సూచనలు చేసింది.

డిఎస్సీ దరఖాస్తుల్లో ఈ పొరపాట్లు చేయకండి

ఏపీలో డిఎస్సీ 2025కు దరఖాస్తు చేసే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలో 16వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ఆదివారం డిఎస్సీ 2025 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ క్రమంలో రెండ్రోజుల్లోనే 20వేల మంది డిఎస్సీకు దరఖాస్తు చేశారు.

మహిళా అభ్యర్థులకు కీలక సూచనలు

  • డిఎస్సీకి దరఖాస్తు చేసే మహిళకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. గత ఆదివారం ఉదయం 10గంటల నుంచి డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
  • ఆదివారం మధ్యాహ్నానికి 4వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం సాయంత్రానికి 21వేల మంది డిఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేశారు.
  • మే 15వ తేదీ వరకు డిఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసేందుకు గడువు ఉంది.
  • ఈ సారి డిఎస్సీ దరఖాస్తులతో పాటు అన్ని రకాల పత్రాలు, కుల, స్థానిక ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
  • పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేస్తేనే హాల్‌ టిక్కెట్‌ జారీ చేస్తారు.
  • డిఎస్సీకి దరఖాస్తు చేసే మహిళా అభ్యర్థులు పదో తరగతిలో సర్టిఫికెట్‌లో ఉన్న పేరునే దరఖాస్తులో నింపాల్సి ఉంటుంది.
  • పెళ్లైన మహిళలు ఆధార్‌ కార్డులో తమ ఇంటి పేర్లను మార్చుకున్నా దరఖాస్తులో మాత్రం పదో తరగతి, విద్యార్హత పత్రాల్లో ఉన్న పేర్లనే కొనసాగించాల్సి ఉంటుంది.
  • మెట్టినింటి పేరుతో దరఖాస్తు చేస్తే వాటిని సవరించడానికి అనుమతించరు. దరఖాస్తుల్లో ఖచ్చితంగా పదో తరగతి నుంచి ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పత్రాలలో ఉన్న ఇంటి పేరునే పేర్కొనాలని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం