Matsyakara Bharosa: నేడు మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్
Matsyakara Bharosa: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు నిజాం పట్నంలో పర్యటించనున్నారు. మత్స్యాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న మత్స్యకార భరోసా నిధుల్ని విడుదల చేయనున్నారు.
Matsyakara Bharosa: వరుసగా ఐదో ఏడాది ఆంధ్రప్రదేశ్లో మత్య్సకారులకు వైఎస్సార్ మత్స్య కార భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. నిజాంపట్నంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో లబ్దిదారుల కుటుంబాలకు నిధులు విడుదల చేయనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 మధ్య కాలంలో వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంద చేస్తోంది.
దీనితో పాటు ఓఎన్జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు రూ. 108 కోట్లతో కలిపి, మొత్తం రూ. 231 కోట్ల సాయాన్ని బాపట్ల జిల్లా నిజాంపట్నంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
నేడు అందిస్తున్న సాయంతో కలిపి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకువైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా అందించిన సాయం రూ. 538 కోట్లుగా ఉంది. ఏటా రూ. 10 వేల చొప్పున మత్స్యకార భరోసా పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 50 వేల లబ్ధి కలిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
సముద్రంపై వేటకు వెళ్లే మత్యకారుల స్థితిగతులను బాగు చేయడంతో పాటు వలసలను అరికట్టే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లాండింగ్ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మత్య్య ఉత్పత్తుల ఎగుమతులకు మరింత ఊతమిచ్చేందుకు 4 ఏళ్ళలోనే సుమారు రూ. 16,000 కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెబుతున్నారు. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో పాటు, తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు చేయడానికి వీలవుతుందని ప్రభుత్వం చెబుతోంది.
అర్హత, నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేసేందుకు తద్వారా మెరుగైన ఫిషింగ్ చేసుకునే పరిజ్ఞానం పెరిగేలా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీష్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఆర్బీకేలలో ఫిషరీస్ అసిస్టెంట్స్ నియామకాన్ని చేపట్టారు. మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ ఇస్తున్నారు. నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్ ఫుట్స్ కూడా ఆర్ బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. మత్స్య సాగుబడి కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు విస్తరణ సేవలు, పంట సలహాలు అందిస్తున్నారు
ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 లకే సబ్సిడి పై విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆక్వా కల్చర్ వ్యాపార కార్యకలాపాల పర్వవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ఆక్వా కలర్ డెవలప్ మెంట్ అథారిటీ 2020కి రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020 అమలు చేస్తోంది. ఇన్ పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందించడానికి తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశారు.
గత ప్రభుత్వంలో ఇలా…
2014–15 సంవత్సరంలో లబ్ధిదారులు 12,178, లబ్ధి (రూ. కోట్లలో) 2.43
2015–16 సంవత్సరంలో లబ్ధిదారులు 66,941, లబ్ధి (రూ. కోట్లలో) 13.39
2016–17 సంవత్సరంలో లబ్ధిదారులు 68,957, లబ్ధి (రూ. కోట్లలో) 27.59
2017–18 సంవత్సరంలో లబ్ధిదారులు 73,017, లబ్ధి (రూ. కోట్లలో) 29.21
2018–19 సంవత్సరంలో లబ్ధిదారులు 80,000, లబ్ధి (రూ. కోట్లలో) 32.00
మొత్తం రూ. 104.62 కోట్లు
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇలా
2019–20 సంవత్సరంలో లబ్ధిదారులు 1.02,478, లబ్ధి (రూ. కోట్లలో) 102.48
2020–21 సంవత్సరంలో లబ్ధిదారులు 1,09,231, లబ్ధి (రూ. కోట్లలో) 109.23
2021–22 సంవత్సరంలో లబ్ధిదారులు 97,619, లబ్ధి (రూ. కోట్లలో) 97.62
2022–23 సంవత్సరంలో లబ్ధిదారులు 1,05,161, లబ్ధి (రూ. కోట్లలో) 105.16
2023–24 సంవత్సరంలో లబ్ధిదారులు 1,23,519, లబ్ధి (రూ. కోట్లలో) 123.52
మొత్తం రూ. 538.01 కోట్లు నిధులు లబ్దిదారులకు అందించారు. జూన్ 2019 నుండి నేటి వరకు మత్స్యకారుల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 2,43,649 లబ్ధిదారులకు రూ. 3,835.89 కోట్ల సాయాన్ని మత్స్యకార భరోసా పథకానికి అందించారు.
గత ప్రభుత్వం వేట నిషేధ భృతి మొదటి రెండేళ్ళలో ఇచ్చింది కేవలం రూ. 2 వేలు మాత్రమేనని ఆ తర్వాత ఇచ్చింది కూడా కేవలం రూ. 4 వేలేనని, అవి కూడా మర, యాంత్రిక పడవలకే పరిమితం చేశారంటోంది. సగటున 50వేల మందికి కూడా ఇవ్వని దుస్థితి ఉందని, ఐదేళ్లలో ఏటా సగటువ ఇచ్చింది కేవలం రూ. 21 కోట్లు మాత్రమేనని వైసీపీ ఆరోపిస్తోంది. డీజిల్ సబ్సిడీ లీటర్ కు కేవలం రూ. 6 మాత్రమేనని, .. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు... అరకొరగా పారదర్శకత లేకుండా.. కేవలం 1,100 బోట్లకు మాత్రమే పరిమితం చేశారని, ఏటా సగటున చేసిన ఖర్చు కేవలం రూ. 12 కోట్లు మాత్రమేనని చెబుతోంది.
ఆక్వా రైతులకు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకు యూనిట్ విద్యుత్ రూ.3.80 పైసలు.. ఎన్నికల నేపథ్యంలో సబ్సిడీపై రూ. 2లకే యూనిట్ విద్యుత్ ఇస్తామని చెప్పి రూ. 309 కోట్లు ఎగ్గొట్టారని విమర్శిస్తోంది.