అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం-సీఎం చంద్రబాబు-cm chandrababu says compensation for rain hit farmers credited by tomorrow evening ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం-సీఎం చంద్రబాబు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం-సీఎం చంద్రబాబు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. రేపు సాయంత్రంలోగా రైతు ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని ప్రకటించారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం-సీఎం చంద్రబాబు

ఏపీలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. చేతికందిన పంటను నీటి పాలు చేశాయి. అకాల వర్షాలతో వరి, అరటి, మామిడి, మొన్నజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పిడుగుపాటుకి గురై మరణించిన వారి కుటుంబాలను ఆదుడుకుంటామని హామీ ఇచ్చారు.

2224 హెక్టార్లలో వరి పంట నష్టం

ఇటీవల వర్షాలకు ఏపీలో 2224 హెక్టార్లలో వరి, 128 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు సీఎంకు నివేదిక అందించారు.

రంగు మారిన ధాన్యం కొనుగోలు

అకాల వర్షాలు, పంట నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొన్ని చోట్ల ధాన్యం తడిసినట్లు కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారన్నారు. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారని ఇచ్చారు.

ధాన్యం రంగు ఎలా ఉన్నా

ఏ రైతూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి పార్థసారథి అన్నారు. ధాన్యం రంగు ఎలా ఉన్నా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

తడిసిన ధాన్యం కొంటాం

"అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటాం. ధాన్యం తడిసిన రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే అకాల వర్షాలు, పంట నష్టంపై సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు"- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

గాలివాన బీభత్సం

ఏపీలో ఆదివారం నాడు గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలుల దాటికి భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

పది మంది మృతి

చెట్లు పడిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఏడుగురు, చెట్టు కూలి ఒకరు, మరో ప్రమాదం ఇద్దరు మొత్తం పదిమంది మృతిచెందారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. అరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. సకాలంలో మిల్లర్లు కొనుగోలు చేయని కారణంగానే నష్టపోయామని రైతులు వాపోయారు.

వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలమట్టం అయ్యాయి. మొక్కజొన్న,మామిడి రైతులు నిండా మునిగారు. ఈదురు గాలులు వీయడంతో మామిడి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. పసుపు పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం