AP Govt On Pending Bills : ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక, రూ.6700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల-cm chandrababu review on economic department orders to clear 6700 cr pending bills ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt On Pending Bills : ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక, రూ.6700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల

AP Govt On Pending Bills : ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక, రూ.6700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Jan 11, 2025 09:58 PM IST

AP Govt On Pending Bills : ఏపీ ప్రభుత్వం విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చింది. పెండింగ్ బిల్లలను క్లియర్ చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.6700 కోట్ల నిధులతో పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆర్థికశాఖను ఆదేశించారు.

ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక, రూ.6700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక, రూ.6700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల

AP Govt On Pending Bills : ఏపీ సర్కార్ వివిధ వర్గాలకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా రూ. 6700 కోట్ల విడుదలకు సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీని అమలు చేస్తూ.. గత ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సహా.. నిధుల విడుదలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

yearly horoscope entry point

సంక్రాంతి సందర్భంగా వివిధ వర్గాలకు గుడ్ న్యూస్ చెప్పేలా నిర్ణయం తీసుకునేందుకు ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అత్యవసరంగా ఆర్థిక శాఖతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నిధుల లభ్యత.. ఏయే వర్గాలకు బిల్లులు పెండింగులో ఉన్నాయన్న అంశంపై ఆరా తీశారు. పెండింగ్ బిల్లుల స్టాటస్ ను మంత్రి పయ్యావుల వివరించారు. ఉన్న నిధులను బిల్లుల రూపంలో చెల్లించేస్తే.. ఇబ్బందులు వస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకూ ఒకేసారి రూ. వేయి కోట్లు మేర చెల్లింపులు జరిపామని ఆర్థిక శాఖ అధికారులు గుర్తుచేశారు.

వివిధ వర్గాలకు ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు జరపడంలో ఇప్పటికే జాప్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇబ్బందులున్నా.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని.. తాము ఏదో రకంగా సర్దుబాటు చేసుకుంటామని మంత్రి పయ్యావుల సీఎంకు వివరించారు. వెంటనే ఆయా వర్గాలకు నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.

పడిపోయిన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే దిశగా

"వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ. 6700 కోట్ల నిధుల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారు. సంక్రాoతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు ఈ మొత్తం బకాయిలు చెల్లిస్తున్నాం. ఉద్యోగులకు జీపీఎఫ్ కింద రూ.519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక ఇన్ష్టాల్మెంట్ రూ. 214 కోట్లు, సీపీఎస్ కు సంబంధించిన రూ. 300 కోట్లు, టీడీఎస్ కింద రూ. 265 కోట్లు చెల్లిస్తున్నాం. ఉద్యోగులకు మొత్తంగా రూ. 1300 కోట్లు విడుదల చేస్తున్నాం. ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేస్తున్నాం. చిరు కాంట్రాక్టర్లు రూ.10 లక్షల లోపు బిల్లులు ఉన్న 26 వేల మందికి లబ్ది చేకూరేలా రూ.586 కోట్లు విడుదల చేస్తున్నాం. అమరావతి రైతులకు కౌలు బకాయిలు రూ. 241 కోట్లు చెల్లిస్తున్నాం.

చిరు వ్యాపారులు 6 వేల మందికి లబ్ది చేకూరేలా రూ. 100 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు రూ. 500 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 500 కోట్లు విడుదల చేస్తున్నాం.

జగన్ చేసిన రూ. 10 లక్షల కోట్ల అప్పును తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం ఆలోచనలు ఉన్నాయి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ నడవాల్సిన వ్యవస్థ ఎక్కడా ఆగకుండా జాగ్రత్త పడుతున్నాం. పడిపోయిన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే దిశగా సీఎం పని చేస్తున్నారు" - పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి

Whats_app_banner

సంబంధిత కథనం