CBN in NDA : 'చంద్రబాబు' టైమొచ్చింది..! ఇక ఈ సమస్యలకు పరిష్కారం దొరికినట్టేనా..?-chandrababu is likely to focus on these issues first in the background of becoming a key partner at the centre ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn In Nda : 'చంద్రబాబు' టైమొచ్చింది..! ఇక ఈ సమస్యలకు పరిష్కారం దొరికినట్టేనా..?

CBN in NDA : 'చంద్రబాబు' టైమొచ్చింది..! ఇక ఈ సమస్యలకు పరిష్కారం దొరికినట్టేనా..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 06, 2024 02:51 PM IST

Chandrababu Key Partner in NDA : ఏపీలో అధికారంలోకి రావటమే కాకుండా కేంద్రంలోనూ చంద్రబాబు కీలకంగా మారారు. దీంతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను పరిష్కరించుకునే అవకాశం లభించింది.

ఢిల్లీలో ఎన్డీయే కూటమి పక్షాల భేటీలో మోదీతో చంద్రబాబు
ఢిల్లీలో ఎన్డీయే కూటమి పక్షాల భేటీలో మోదీతో చంద్రబాబు

Chandrababu Key Partner in NDA : ఏపీలోలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద విజయాన్ని తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకుంది. ఇదే సమయంలో కేంద్రంలోనూ కీలకంగా మారిపోయింది. ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. 16 ఎంపీ స్థానాలతో బలమైన శక్తిగా మారింది. దీంతో కేంద్రంలో మళ్లీ చంద్రబాబు పావులు కదిపే సువర్ణ అవకాశం లభించిందన్న విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి.

yearly horoscope entry point

కేంద్రం వద్ద పెండింగ్ అంశాలు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. గతంలో ఉన్న జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం….పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పెద్దగా పరిష్కరం కాలేదు. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో….. చంద్రబాబు కేంద్రంలో అత్యంత కీలంగా మారారు.

బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోగా… భాగస్వామ్యపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో నితీశ్ కుమార్, చంద్రబాబు కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు…. ఏపీకి సంబంధించి పలు ముఖ్య అంశాలపై దృష్టిసారించి….త్వరితగతిన కేంద్రం నుంచి పరిష్కారం రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందులో కొన్ని అంశాలను చూస్తే…….

  • -2014 జూన్‌ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసింది. దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే చెల్లించేలా కేంద్రం తరపున తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవచ్చే అవకాశం చంద్రబాబుకు ఉంటుంది.
  • పోలవరం ప్రాజెక్ట్‌ కు రావాల్సిన నిధుల విషయంలో త్వరితగతని అడుగులుపడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఏఏ శాఖల వద్ద ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయో…. ఆయా శాఖలతో మాట్లాడి పనులను మరింత స్పీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
  • రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా మరికొన్ని హామీల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
  • అమరావతి పనులు మళ్లీ వేగవంతం కావటంతో కేంద్రం నుంచి నిధులు రాబట్టే అవకాశం ఉంది.
  • కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులతో పాటు తగిన సహాయ సహకారాలపై చర్చించే అవకాశం ఉంటుంది.
  • భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే ఆరు లేన్ల రహదారి పనులు వేగవంతంతో పాటు మరికొన్ని జాతీయ ప్రాజెక్టులపై ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది.
  • విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలిపేలా కేంద్రాన్ని ఒప్పించే అవకాశం ఉంటుంది.

ఇవేకాకుండా…. అమరావతి రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రతి అంశంపై కూడా ఏపీలోని చంద్రబాబు సర్కార్ ప్రధానంగా దృష్టిపెట్టే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలపై స్పందిస్తున్న పలువురు విశ్లేషకులు…. చంద్రబాబు టైమ్ వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. వైసీపీకేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలను చూస్తే… తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది.

జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. బీజేపీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందింది. పార్లమెంట్ స్థానాల్లో చూస్తే… టీడీపీ 16 ఎంపీ స్థానాలు, వైసీపీ 4, జనసేన 2, బీజేపీ 3 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది.

Whats_app_banner