నేడు, రేపు ఏపీలో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణంలో అనూహ్య మార్పులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు-chance of sudden rains with thunders in ap today and tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నేడు, రేపు ఏపీలో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణంలో అనూహ్య మార్పులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

నేడు, రేపు ఏపీలో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణంలో అనూహ్య మార్పులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

Sarath Chandra.B HT Telugu

ఏపీ వాతావరణంలో అనూహ్య మార్పులతో జనం బెంబేలెత్తి పోతున్నారు. అప్పటి వరకు భానుడి భగభగలతో ఠారెత్తిస్తే అంతలోనే కారు మబ్బులు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఏపీలో నేడు రేపు ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం (unsplash)

ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 7 గంటల నాటికి కాకినాడ జిల్లా కాజులూరులో 100. 5మిమీ, చొల్లంగిపేటలో 94.5మిమీ, కరపలో 75.5మిమీ, కాకినాడలో 66.7మిమీ, కోనసీమ జిల్లా అమలాపురంలో 65.5మిమీ, ఏలూరు నిడమర్రులో 65.2మిమీ, తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 65మిమీ,ఏలూరు ధర్మాజీగూడెంలో 64.5మిమీ వర్షపాతం చొప్పున భారీ వర్షాలు నమోదైంది

పలు జిల్లాల్లో 130చోట్ల 20మిమీ కంటే ఎక్కువ పిడుగులతో కూడిన మోస్తారు వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడి పోయే పరిస్థితుల నుంచి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వర్షం దంచి కొడుతోంది.

ఏపీలో మరో రెండు రోజుల వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలతో తడిచి ముద్దయ్యాయి.

సోమ, మంగళ వారాల్లో (మే 5, 6తేదీల్లో) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా,నెల్లూరు,కర్నూలు, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని అధికారులు హెచ్చరించారు.

పెరగనున్న ఉష్ణోగ్రతలు…

రానున్న రెండు రోజులు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 41°C - 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది.

ఆదివారం నంద్యాల జిల్లా గోనవరంలో 42.7°C, నెల్లూరు జిల్లా సోమశిలలో 42.5°C, తిరుపతి జిల్లా

వెంకటగిరిలో 42.1°C, వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 41.8°C, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 41.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం