AP Cabinet Meeting: రాజధాని నిర్మాణ పనులు, పారిశ్రామిక పెట్టుబడులకు క్యాబినెట్‌లో అమోదం.. ప్రధాని పర్యటనపై సమీక్ష-cabinet approves capital construction works and investments review of prime ministers visit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Meeting: రాజధాని నిర్మాణ పనులు, పారిశ్రామిక పెట్టుబడులకు క్యాబినెట్‌లో అమోదం.. ప్రధాని పర్యటనపై సమీక్ష

AP Cabinet Meeting: రాజధాని నిర్మాణ పనులు, పారిశ్రామిక పెట్టుబడులకు క్యాబినెట్‌లో అమోదం.. ప్రధాని పర్యటనపై సమీక్ష

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 02, 2025 02:37 PM IST

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలకు అమోదం తెలిపారు. రూ.2700కోట్ల రుపాయలతో రాజధాని నిర్మాణ పనులతో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి అమోదం తెలిపారు. మునిసిపల్ చట్ట సవరణలు సహా 14 అంశాలకు క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.

ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌ సమావేశం
ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌ సమావేశం

AP Cabinet Meeting:  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం రూ.2700 కోట్ల పనులకు ఏపీ  క్యాబినెట్‌ తెలిపింది. ఈ నిధులతో  రాజధాని నిర్మాణ పనులను చేపడతారు. భవనాలకు అనుమతులు ఇచ్చే అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్థానంలో మునిసిపాలిటీలు అనుమతిచ్చేలా చట్ట సవరణ చేశారు.

yearly horoscope entry point
  • రాజధాని అమరావతి కి 2733 కోట్ల రూపాయలు విలువైన పనులకు అమోదం తెలిపింది. 
  • ఇకపై మున్సిపాలిటీల్లో లే అవుట్ ల అనుమతులు, భవనాలు నిర్మాణ అనుమతులు ఇకపై మున్సిపాలిటీ కే అప్పగిస్తూ ఆర్డినెన్సు కు అమోదం లభించింది. 
  • పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల మంజూరు చేశారు. 
  • తిరుపతి లోని ఈ ఎస్ ఐ హాస్పటల్ ను 50 పడకల నుండి 100 పడకల కు పెంచుతూ క్యాబినెట్ అమోదం తెలిపింది. 
  • స్టేట్‌ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్రమోషన్స్ బోర్డు అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు అమోదం లభించింది.  ఈ పెట్టుబడులు వ‌ల‌న 2,63,411 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 
  • నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు క్యాబినెట్  ఆమోదం తెలిపింది.
  • విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ ఏర్పాటుకు  రూ. 80 కోట్ల పెట్టుబడుల‌కు  అమోదం తెలిపింది. 
  • శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ‌ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడులకు అమోదం తెలిపింది. 
  • అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు క్యాబినెట్ఆమోదముద్ర లభించింది. 
  • రాష్ట్రంలో కొత్త‌గా ఐదు సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడుల‌కు అమోదం తెలిపారు. 
  • ఏఎం గ్రీన్ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 592 ఎకరాల్లో రూ. 12,000 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం తెలిపారు. 
  • జాన్ కోకిరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 2,000 వేల కోట్లతో 40 ఎకరాల్లో 2 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్ కు అమోదం తెలిపారు. 
  • కర్నూలు జిల్లాలోని హోసూరు,పెద్ద హుల్తిలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 1,800 ఎకరాల్లో 2 వేల కోట్ల తో ఏర్పాటు చేయ‌నున్న‌ 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కు అమోదం లభించింది. 
  • వైఎస్సాఆర్ జిల్లాలోని మైలవరం, కొండాపురం అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ 1,080 ఎకరాల్లోరూ. 2,000 కోట్ల పెట్టుబడుల‌కు క్యాబినెట్ అమోదం తెలిపింది. 
  • 119 మెగావాట్ల విండ్ పవర్, 130 మెగావాట్ల సోలార్ హైబ్రీడ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్రంలో 65 వేల కోట్ల రుపాయిల‌తో 5 లక్షల ఎకరాల్లో 11 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటుకు అమోదం  తెలిపారు. 
  • అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు  గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.  వీటితోపాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో చర్చించారు. 
  • ప్రధాని పర్యటనకు క్యాబినెట్‌ సబ్ కమిటీ..

క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో పాలనా అంశాలు కొద్దిసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముచ్చటించారు.  కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాల పైన చర్చించారు.  వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై చర్చించారు. 

రైతులకు కేంద్ర ప్రభుత్వ సాయం తో కలిపి ఆర్థిక సాయాన్ని రూ 20,000 ను ఒకేసారి చెల్లించే అంశంపై మంత్రులతో చర్చించారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం పైన చర్చి జరిగినట్టు తెలుస్తోంది.  వేట నిలిచిపోయిన సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.20వేలను వారికి చెల్లించే అంశంపై మంత్రులతో మాట్లాడారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని సీఎం సూచించారు. 

రాష్ట్రంలో ప్రధాని పర్యటన ను విజయవంతం చేసేందుకు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు.  ఈనెల ఎనిమిదో తేదీన విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో  ప్రధాని రోడ్ షో కూడా నిర్వహించే నేపథ్యంలో దాన్ని విజయవంతం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. 

Whats_app_banner