ఏపీ రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజీపీ సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది.
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు కీలక నేతలు పోటీపడ్డారని సమాచారం. ఈ స్థానం కోసం తమిళనాడుకు చెందిన అన్నామలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ పేర్లు వినిపించాయి. అయితే బీజేపీ అధిష్ఠానం పార్టీ విధేయతకే మొగ్గుచూపింది. పార్టీ సీనియర్ నేత పాకా సత్యనారాయణకు సీటు కేటాయించింది.
పాకా సత్యనారాయణ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో పాకా భీమవరంలో కౌన్సిలర్ గా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ గా పనిచేస్తున్నారు.
ఏపీ రాజ్యసభ ఉపఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ దాఖలు గడువు ముగియనుంది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన, మే 2 వరకు ఉపసంహరణకు గడువు విధించింది ఎన్నికల సంఘం. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మే 13వ తేదీతో ఉప ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కూటమి పార్టీలు బీజేపీకి కేటాయించాయి. దీంతో బీజేపీతో పలువురు కీలక నేతలు ఈ స్థానానికి పోటీ పట్టారు. రాజ్యసభ స్థానం భర్తీపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఎన్డీఏ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ అధిష్ఠానం ఖారారు చేసింది.
మంగళవారం నామినేషన్ కు చివరి తేదీ కావడంతో బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి యూరప్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. అయితే సీనియర్ నేత పాకా వెంకట సత్యనారాయణ వైపే అధిష్ఠానం మొగ్గు చూపడంతో ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు.
సంబంధిత కథనం