విశాఖ వేదికగా శనివారం(జూన్ 21) అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని మోదీ పాల్గొననున్న నేపథ్యంలో…కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండు గిన్నీస్ రికార్డులు, మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధనే లక్ష్యంగా యోగా డే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇందుకోసం ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది.