APSRTC : భక్తులకు ఆర్టీసీ గుడ్న్యూస్.. వైష్ణవ క్షేత్ర దర్శినికి ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీ ఇదే
APSRTC : పుణ్యక్షేత్రాల యాత్ర చేసే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం ఆర్టీసీ డిపోల నుంచి ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి బస్ సర్వీస్లను వేసింది.
ఏపీఎస్ ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్ను బట్టీ, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి లగ్జరీ బస్సు సర్వీస్లను అందుబాటులోకి తెచ్చింది.
ఏయే తేదీల్లో..
మార్గశిర మాసంలో వైష్ణవ క్షేత్రదర్శిన పేరుతో డిసెంబర్ 14 నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయలుదేరుతాయి.
ఆలయాల సందర్శన..
ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలైన ద్వారకా తిరుమల, వాడపల్లి, అన్నవరం చేరుకుని అక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారు. అక్కడ నుంచి తిరిగి ఆయా డీపోలకు బస్సులు వెళ్తాయి.
ప్యాకేజీ..
అవనిగడ్డ నుంచి ఒక్కో టికెట్ ధర ఎక్స్ప్రెస్ సర్వీసులకు రూ.920, అల్ట్రా డీలక్స్ సర్వీసులకు రూ.1,000, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.1,100లుగా నిర్ణయించారు. మచిలీపట్నం నుంచి ఒక్కో టికెట్ ధర అల్ట్రా డీలక్స్ సర్వీసులకు రూ.975, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.1,050లుగా నిర్ణయించారు. గుడివాడ నుంచి ఒక్కో టికెట్ ధర అల్ట్రా డీలక్స్ సర్వీసులకు రూ.950, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.1,050లుగా నిర్ణయించారు.
ఉయ్యూరు నుంచి ఒక్కో టికెట్ ధర ఎక్స్ప్రెస్ సర్వీసులకు రూ.800, అల్ట్రా డీలక్స్ సర్వీసులకు రూ.950లుగా నిర్ణయించారు. గన్నవరం నుంచి ఒక్కో టికెట్ ధర ఎక్స్ప్రెస్ సర్వీసులకు రూ.700, అల్ట్రా డీలక్స్ సర్వీసులకు రూ.850లుగా నిర్ణయించారు.
ఫోన్ నెంబర్లు..
1. అవనిగడ్డ- 99592 25466
2. మచిలీపట్నం- 99592 25462
3. గుడివాడ- 99592 25464
4. ఉయ్యూరు- 99592 24796
5. గన్నవరం- 87909 96090
టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా https://www.apsrtconline.in/oprs-web/services/packagetours.do బుక్ చేసుకోవచ్చు. లేకపోతే సంబంధిత ఆర్టీసీ డీపోల్లో పొందవచ్చు. శబరిమలై, షిర్డీ, వారణాసి, అయోధ్య వంటి క్షేత్రాలకు బృందాలుగా వెళ్లాలనుకుంటే అద్దె ప్రాతిపదికన ఏసీ, సూపర్ డీలక్స్ బస్సులను ఏర్పాటు చేస్తామని కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.వాణిశ్రీ వివరించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)