నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా, ఏపీపీఎస్సీ పెండింగ్ నోటి ఫికేషన్లపై కసరత్తు మొదలుపెట్టింది. జనవరిలోనే ఉద్యోగాల భర్తీపై ప్రకటన రావాల్సి ఉండగా, ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. వివిధ శాఖల్లో సుమారు 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అటవీ శాఖలో 814 పోస్టులున్నాయి. ఎస్సీ వర్గీకరణకు రోస్టర్ పాయింట్లు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ విషయంపై స్పష్టత రాగానే ఏపీపీఎస్సీ నోటి ఫికేషన్ల జారీ చేయనుంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు మే 3 నుంచి ప్రారంభం కానున్నాయి. మరో పది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. ఏపీపీఎస్సీ కమిషన్ వెబ్ సైట్లో గ్రూపు-1 హాల్ టిక్కెట్లను విడుదల చేశారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. గ్రూపు-1 ప్రధాన పరీక్షలు రాయనున్న అభ్యర్థుల హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజ బాబు పలు సూచనలు చేశారు. మొత్తం 7 పరీక్షలను ఎంపిక చేసిన 4 జిల్లాల్లో మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వ హించనున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
(ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 01.00 వరకు)
సంబంధిత కథనం