తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె…. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమేనని స్పష్టం చేశారు. వైసీపీ నేత వైసీపీ సుబ్బారెడ్డి... ట్యాప్ చేసిన ఆడియోలు స్వయంగా తనకే వినిపించాడని గుర్తు చేశారు.
ఈ కేసులో తాను ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమన్న చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ - జగన్ సంబంధాల ముందు రక్త సంబంధం కూడా పనికిరాలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఫోన్ ట్యాపింగ్పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. దోషులకు శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు.