ఏపీలో భానుడి భగభగలు, రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు-ap weather report extreme heat wave conditions in 28 mandals tomorrow alert to people ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో భానుడి భగభగలు, రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు

ఏపీలో భానుడి భగభగలు, రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఏపీలో రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎల్లుండి 12 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది.

ఏపీలో భానుడి భగభగలు, రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలో రేపు(మంగళవారం) 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు శ్రీకాకుళం జిల్లాలోని 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 13 మండలాలు, మన్యం జిల్లాలో 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం 12 మండలాల్లో తీవ్ర వడగాలులు, 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో 1 మండలం, విజయనగరం జిల్లాలో 8 మండలాలు, మన్యం జిల్లాలో 3 మండలాలు, అల్లూరి జిల్లాలో 1 మండలం, అనకాపల్లి జిల్లాలో 3 మండలాలు, కాకినాడ జిల్లాలో 3 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం తిరుపతి రూరల్ లో 42.1°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, విజయనగరంలో 41.5°C, నెల్లూరు జిల్లా దగదర్తిలో 41.4°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.

సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పలు చోట్ల 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. రాత్రిళ్లు వాతావరణం మారుతున్న...పగటి పూట వేడికి ఇంట్లో ఉక్కపోత అధికంగా ఉంటుంది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

సోమవారం విశాఖ వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ...రెండు తెలుగు రాష్ట్రాలలో పొడి వాతవరణం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డీగ్రీలు ఎక్కువుగా నమోదయ్యే ఆవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు, ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు పడే ఆవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు కనిష్టంగా 28 డిగ్రీలు, గరిష్టంగా 40 డిగ్రీల వరకు నమోదయ్యే ఆవకాశం ఉందని పేర్కొన్నారు. వేడి, ఉక్కపోత తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం