కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా ఎంతంటే..
కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కు 4.04శాతం వాటా దక్కనుంది. అంటే రూ. 33,049కోట్లు.
కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కు.. రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు వాటా రానుంది. అందులో కార్పొరేషన్ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్ జిఎస్టి రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్ రూ. రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 446.34 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.33.18 కోట్లు ఏపీకి రానున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
తెలంగాణకు రూ. 17 వేల కోట్లు
మరోవైపు కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.17,165.98 (2.102 శాతం) కోట్లు వాటా రానుంది. అందులో కార్పొరేషన్ పన్ను రూ.5,359.87 కోట్లు, ఆదాయపు పన్ను రూ.5,176.50 కోట్లు, సంపద పన్ను రూ. -0.19 కోట్లు, సెంట్రల్ జిఎస్టి రూ.5,636.47 కోట్లు, కస్టమ్స్ రూ. రూ.744.26 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 231.83 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.17.24 కోట్లు తెలంగాణకు దక్కనున్నాయి.
సంబంధిత కథనం