AP SSC 10th Class Results 2025:ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల, 81.14 శాతం ఉత్తీర్ణత, ఫలితాల్లో బాలికలే టాప్‌…-ap ssc 2025 results released today know results on ht telugu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc 10th Class Results 2025:ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల, 81.14 శాతం ఉత్తీర్ణత, ఫలితాల్లో బాలికలే టాప్‌…

AP SSC 10th Class Results 2025:ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల, 81.14 శాతం ఉత్తీర్ణత, ఫలితాల్లో బాలికలే టాప్‌…

Sarath Chandra.B HT Telugu

AP SSC 10th Class Results 2025: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఆ తర్వాత సెకండరీ బోర్డ్ వెబ్‌సైట్‌తో పాటు హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 81.14శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

AP SSC 10th Class Results 2025: ఆంధ్రప్రదేశ్‌ పదో పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 10గంటలకు ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేశారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలను హిందుస్తాన్‌ టైమ్స్‌ వెబ్‌సైట్‌లో నేరుగా తెలుసుకోవచ్చు.

https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్‌ హెచ్‌టీ ఇంగ్లీష్‌ సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ క్లిక్‌ చేసి ఫలితాలను పొందండి.

ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాలను ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. వాట్సాప్‌ మనమిత్ర, లీప్ అప్లికేషన్‌, వెబ్‌సైట్‌లలో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

ఈ ఏడాది ఏపీలో 6,14, 459మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురలో 78.31శాతం, బాలికల్లో 84.09శాతం ఉత్తీర్ణత నమోదైంది.

100శాతం ఉత్తీర్ణత…

రాష్ట్ర వ్యాప్తంగా 1680 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19పాఠశాలల్లో 0శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90శాతం ఉత్తీర్ణులు అయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 47.64శాతం ఉత్తీర్ణత నమోదైంది.

సెకండరీ బోర్డు సైట్ లింకులు ఇవిగో…

పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://www.bse.ap.gov.in/ , https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

మన మిత్రలో రిజల్ట్స్ ఇలా పొందొచ్చు..

ఏపీ ప్రభుత్వం పౌరసేవల్ని అందిస్తున్న వాట్సాప్‌ మనమిత్ర నంబరులో పది పలితాలు కూడా తెలుసుకోవచ్చు.

  • అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్లో వాట్సప్ యాప్‌లో " 9552300009 నంబర్ కు "Hi" అని మెసేజ్ పంపి, అందలో వచ్చే ఆప్షన్లలో విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, రోల్ నంబర్ నమోదు చేయడం ద్వారా ఫలితాల పీడీఎఫ్ కాపీని పొందవచ్చు.
  • పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్ల ద్వారా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ల ద్వారా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
  • ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. 2024–25 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు.
  • ఈ ఏడాది మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు, వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం