ఏపీలో లాసెట్ 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా.. ఇవాళ్టి నుంచి (నవంబర్ 14) రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. https://lawcet-sche.aptonline.in వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లాసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏపీ లాసెట్ పరీక్షను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు జూన్ 27న వెల్లడించారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.