Kapu Corporation Loans : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీపై కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తుంది. బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులకు సబ్సిడీపై రుణాలు ఇస్తున్నారు. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అర్హులైన వారు ఈ నెల 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రెండు విధాలుగా రుణాలు అందిస్తున్నారు.
కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ (APSKWDC) రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కాపు కులాల వారికి "ఆర్థిక సహాయ కార్యక్రమం- చంద్రన్న స్వయం ఉపాధి"లో భాగంగా రుణసదుపాయం అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 2,50,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ సహాయం కొత్త వ్యాపారాలను స్థాపించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ఉపయోగపడుతుంది.
➤ మీ యూనిట్ ధర రూ.2,00,000 వరకు అయితే దాని ఖర్చులో 50% వరకు గరిష్టంగా రూ. 1,00,000 బ్యాంకు నుంచి దరఖాస్తుదారుడు రుణం పొందవచ్చు.
➤ యూనిట్ ధర రూ.3,00,000 అయితే దాని ఖర్చులో 50% వరకు, గరిష్టంగా రూ. 1,50,000 వరకు బ్యాంకు నుంచి దరఖాస్తుదారుడు రుణంగా తీసుకోవచ్చు.
➤ యూనిట్ ధర రూ.5,00,000 వరకు అయితే దాని ఖర్చులో 50%, గరిష్టంగా రూ. 2,50,000 (రూ. రెండు లక్షల యాభై వరకు) రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది.
అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును APSKWDC వెబ్సైట్లో సూచించిన ఫార్మాట్లో ఆన్లైన్లో నమోదుచేసుకోవాలి. ఈ https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
1. దరఖాస్తుదారు కుటుంబానికి చెందిన తెల్ల రేషన్ కార్డ్
2. దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు
3. కుల ధృవీకరణ పత్రం
4. పుట్టిన తేదీ రుజువు
5. పాస్పోర్ట్ సైజు ఫొటో (50 KB పరిమాణం వరకు)
ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSKWDC) "గ్రూప్ MSME ప్రోగ్రామ్"ను ప్రారభించింది. ఈ కార్యక్రమం కింద నిర్ణీత ప్రక్రియ ద్వారా ఎంపికైన దరఖాస్తుదారులకు రూ. 1,000,000 (రూ. పది లక్షలు) ఆర్థిక సహాయం అందించనుంది. కొత్త ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ని స్థాపించడానికి 3 నుంచి 5 మంది సభ్యులు గ్రూప్ గా ఏర్పడి దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఖర్చు కనీసం రూ. 25,00,000 (రూ. ఇరవై ఐదు లక్షలు).
2. కార్పొరేషన్ ద్వారా రూ. 10,00,000 (రూ. పది లక్షలు) సబ్సిడీ అందిస్తారు.
3. ప్రాజెక్ట్ కోసం మార్జిన్ మనీ పరంగా లబ్ధిదారుల కనీసం రూ. 5,00,000 పెట్టుబడి కలిగి ఉండాలి.
4. సబ్సిడీ, లబ్ధిదారుల సహకారం తర్వాత మిగిలిన అవసరమైన బ్యాలెన్స్ బ్యాంక్ లోన్గా పొందవచ్చు. ఇది కనీసం రూ. 10,00,000కి సమానం.
అర్హత గల సభ్యులు తమ దరఖాస్తును https://apobmms.apcfss.in/ వెబ్సైట్లో నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి.
1. ఆదాయ ధృవీకరణ పత్రం
2. ఆధార్ కార్డ్
3. కుల ధృవీకరణ పత్రం
4. పుట్టిన తేదీ రుజువు
5. SSC ఉత్తీర్ణత సర్టిఫికేట్
6. పాన్ కార్డు
7. పాస్పోర్ట్ సైజు ఫొటో (JPEG ఫార్మాట్ లో 50 KB పరిమాణం వరకు)
8. గ్రూప్లోని సభ్యులందరి 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు.
9. ఆర్థిక అంశాలతో ప్రాజెక్ట్ నివేదిక
10. ప్రతి సభ్యుడు ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు డిఫాల్టర్ కాదని స్వీయ అఫిడవిట్ (ప్రభుత్వ అధికారిచే ధృవీకరించాలి).
11. మార్జిన్ మనీని ఏర్పాటు చేయడం గురించి సభ్యులందరి సంతకాలు
ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. బీసీ, ఈసీబీ వర్గాల దరఖాస్తులకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. అయితే కాపు లోన్ల దరఖాస్తులకు చివరి తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సంబంధిత కథనం