AP Govt Schools : ఆగస్టు 15న అవార్డులు అందుకునే ఏపీలోని 7 ఉత్తమ పాఠశాలలివే..
ఏపీ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేదుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని 7 అత్యుత్తమ పాఠశాలలను ఆగస్టు 15న అవార్డులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఏడు పాఠశాలలకు ప్రభుత్వం అవార్డులు అందజేయనుంది. 2022 ఎస్ఎస్సీ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏడు పాఠశాలలకు మెమెంటోలను అందజేయనున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి అత్యధిక మార్కులు సాధించిన 7 ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఎంపిక చేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేయనున్నారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు జెడ్పీ హైస్కూల్, శ్రీకాకుళం జిల్లా కింతలి జెడ్పీ హైస్కూల్, విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ బాలికల రెసిడెన్షియల్ హైస్కూల్, విజయనగరం జిల్లా భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, విజయనగరం జిల్లా పెరుమాళి జిల్లాకు చెందిన పెరుమాళి కురామ్ జిల్లా సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ పాఠశాలను ఎంపిక చేశారు. ఉత్తమ పాఠశాలలుగా మెరియల్ కళాశాల మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, శ్రీకాకుళం జిల్లా వంగర KGB విద్యాలయం ఎంపికయ్యాయి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 13 నుండి 15 తేదీ వరకూ ఏపీ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటిపైన ప్రతి కార్యాలయం, ప్రతి భవనం పైన మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. కోటి 42 లక్షల జాతీయ జెండాలు అవసరం ఉంటుందని కేంద్రానికి తెలియజేయగా కేంద్రం నుండి 40 లక్షల వరకూ సరఫరా కానున్నాయి. మరో 30 లక్షలు జెండాలను మెప్మా, 10 లక్షల జెండాలను సెర్ప్ ఆధ్వర్యంలో సిద్ధం చేసి పంపిణీ చేయనున్నారు.
అటవీ శాఖ ద్వారా 80 లక్షల జెండా కర్రలు సరఫరా కానున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, లయన్స్, రోటరీ క్లబ్, ఇతర సంఘాలా ద్వారా జెండాలు రానున్నాయి. పాఠశాలు, కళాశాలు, విశ్వవిద్యాలయాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వాములను చేసి విజయవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఆగస్టు 11వతేదీన హెరిటేజ్ వాక్,12వ తేదీన క్రీడా పోటీలు,13వ తేదీన జాతీయ జెండాతో సెల్పీ కార్యక్రమం ఉండనున్నాయి. విజయవాడలో చిన్నారులు, కళాకారులు, ప్రజలతో కలిసి 3 కి.మీల పొడవున జాతీయ జెండా ప్రదర్శన జరుగుతుంది. ఆగస్టు 14వ తేదీన స్వాతంత్ర్య సమరయోధుల ఇంటికి నడక కార్యక్రమం, స్వాతంత్ర్య సమరయోధులు వారి కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆగస్టు 15వతేదీన జాతీయ జెండా ఆవిష్కరణ పాదయాత్రలు మరియు ప్లాగ్ మార్చ్ లను వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.