ఏపీ ప్రజలపై వరాల జల్లు, జూన్ 12న ఖాతాల్లో డబ్బులు-ఒకే రోజు కీలక పథకాలు ప్రారంభం-ap govt launches annadata sukhibhava thalli ki vandanam schemes on june 12 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ ప్రజలపై వరాల జల్లు, జూన్ 12న ఖాతాల్లో డబ్బులు-ఒకే రోజు కీలక పథకాలు ప్రారంభం

ఏపీ ప్రజలపై వరాల జల్లు, జూన్ 12న ఖాతాల్లో డబ్బులు-ఒకే రోజు కీలక పథకాలు ప్రారంభం

ఏపీలో ఒకే రోజు పలు కీలక పథకాలు ప్రారంభించనున్నారు. జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, కొత్త పింఛన్ల పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టునున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో ప్రకటించింది.

జూన్ 12న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు ప్రారంభం

ఏపీలో ఒకే రోజు పలు కీలక పథకాలు ప్రారంభించనున్నారు. జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో ప్రకటించింది.

సంక్షేమ క్యాలెండర్

ప్రతినెలా అమలు చేసే సంక్షేమ పథకాల వివరాలతో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది కానుంది. ఈ సందర్భంగా జూన్ 12న తల్లికి వందనం కింద చదువుతున్న విద్యార్థులందరికీ రూ.15 వేలు ఖాతాల్లో జమ చేయనున్నారు.

అలాగే జూన్ 12న అన్నదాత సుఖీభవ పథకం (మూడు విడతల్లో రూ.20 వేలు) ప్రారంభించనుంది. అదే రోజున లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు అందించనున్నారు.

పొలిట్ బ్యూరో సమావేశం

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించారు. మహానాడు నిర్వహణే ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. పహల్గాం దాడి అమరులకు టీడీపీ పొలిట్ బ్యూరో నివాళులు అర్పించింది.

కడపలో మహానాడు

పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం టీడీపీ సీనియర్ నేత, మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27, 28, 29న మహానాడుని కడపలో ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందిస్తూ టీడీపీ పొలిట్‌బ్యూరో తీర్మానం చేసిందని చెప్పారు.

ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక నిర్ణయం

"దీపం 2 పథకం ద్వారా ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలని నిర్ణయించాం. అలాగే జూన్ 12 నుంచి కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

జూన్ 12న పిల్లల స్కూల్స్ తెరిచే ముందే, తల్లికి వందనం ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం. త్వరలోనే, ఏ నెలలో ఏ పథకం ప్రభుత్వం ఇస్తుందో తెలియ చేస్తూ, సంక్షేమ పథకాల క్యాలెండర్‌ని ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తారు" - మంత్రి అచ్చెన్నాయుడు

ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన

రాబోయే రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే దీపం పథకం మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి వేయాలని నిర్ణయించామన్నారు. 2014-19 మధ్య నిలిచిపోయిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్నారు.

తిరంగా ర్యాలీలు

ఉగ్రదాడిలో అమరులైన వారికి సంఘీభావంగా ఈనెల 16, 17, 18 తేదీల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోదీ, త్రివిధ దళాలను పొలిట్ బ్యూరో అభినందిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం