మైనారిటీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, సబ్సిడీపై రూ.8 లక్షల వరకూ రుణాలు- ఇలా అప్లై చేసుకోండి-ap govt good news for minorities loans up to 8 lakh on subsidy apply process details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మైనారిటీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, సబ్సిడీపై రూ.8 లక్షల వరకూ రుణాలు- ఇలా అప్లై చేసుకోండి

మైనారిటీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, సబ్సిడీపై రూ.8 లక్షల వరకూ రుణాలు- ఇలా అప్లై చేసుకోండి

ఏపీ ప్రభుత్వం మైనారిటీలకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందిస్తుంది. చిన్న తరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభం అయ్యింది.

మైనారిటీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, సబ్సిడీపై రూ.8 లక్షల వరకూ రుణాలు- ఇలా అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రవాణా, పరిశ్రమలు, సేవా, వ్యాపార రంగాలలో స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తుంది. ఈ పథకం ద్వారా మైనారిటీలు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం పొందవచ్చు.

చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు

మైనారిటీల స్వయం ఉపాధి రుణాలు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను మైనారిటీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.173.57 కోట్లు కేటాయించింది. ఈ నిధులను మైనారిటీ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అందించనున్నారు.

ఫ్యాషన్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, కార్పెంటరీ వంటి వాటిలో నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు. ఈ నెల 25 నుంచి దరఖాస్తులు ప్రారంభించారు. మే 25 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని మంత్రి ఎన్.ఎండీ. ఫరూక్ తెలిపారు.

స్వయం ఉపాధి పథకాలు

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, రవాణా, పరిశ్రమలు, సేవా, వ్యాపార రంగాలలో స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీపై రుణాలు అందిస్తారు.

అర్హతలు

  1. దరఖాస్తుదారుడు మైనారిటీ వర్గానికి చెందినవాడు అయి ఉండాలి అంటే ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు.
  2. దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడు అయి ఉండాలి
  3. వయస్సు పరిమితి 21 నుంచి 55 సంవత్సరాలు
  4. తల్లిదండ్రులు/దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000
  5. లబ్ధిదారునికి స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  6. జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ ఉండాలి.

కావాల్సిన పత్రాలు

  • ఆధార్ కార్డు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • రేషన్ కార్డు
  • చదువుకు సంబంధించిన పత్రాలు
  • డ్రైవింగ్ లైసెన్స్

దరఖాస్తు ఎలా చేయాలి?

  • ముందుగా లబ్ధిదారుడు తన ప్రాథమిక వివరాలను https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ లో నమోదు చేసుకుని యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందాలి.
  • యూజర్ ఐడీ : రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్
  • పాస్‌వర్డ్: రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వచ్చిన OTP
  • లబ్ధిదారుడు తన దరఖాస్తును పూర్తి చేయడానికి చిరునామా, కులం, పథకం వివరాలను పూర్తి చేసి లాగిన్ అవ్వాలి. పూర్తి వివరాలు నమోదు చేయాలి.
  • దరఖాస్తుదారుడు ప్రింట్ దరఖాస్తు తీసుకోవాలి.

లబ్దిదారులకు బ్యాంక్ ద్వారా రుణాలు

ఈ పథకంలో లబ్ధిదారులకు యూనిట్ ఏర్పాటు చేసుకోడానికి అయ్యే ఖర్చును బ్యాంక్ ముందుగా విడుదల చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీని మాత్రం బ్యాంక్ లో టర్మ్ డిపాజిట్ రూపంలో ఉంచుతారు. యూనిట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ చేస్తారు.

థర్డ్ పార్టీ ద్వారా రెండు సార్లు తనిఖీ చేస్తారు. యూనిట్ మొదలు పెట్టిన రెండేళ్ల అనంతరం మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు మరోసారి తనిఖీ చేస్తారు. అప్పుడు లబ్ధిదారుడు బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ డబ్బును సరిగ్గా కడుతున్నాడా? లేదా? అని చూస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే రాయితీ నగదును అతని లోన్ ఖాతాకు జమ చేస్తారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం