‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజును భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలను చేపట్టనుంది. విశాఖలో నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నాయి. ఒక్క విశాఖలోనే ఒకే రోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. 25 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు అందజేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యోగా మన జీవితంలో భాగం కావాలని… ఆయుష్ ద్వారా యోగాను ప్రతి ఒక్క ఇంటికి చేర్చేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆర్కె బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు జరిగే యోగా ప్రదర్శనలో భారీ ఎత్తున ప్రజలు భాగస్వాములవుతారని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
యోగాంధ్ర కార్యక్రమంలో 2 కోట్ల మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పేర్ల నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే కోటిపైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి 2 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
యోగాంధ్ర కార్యక్రమంలో భాగమయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా https://yogandhra.ap.gov.in/#/home/yoga-registration వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడ ఫామ్ అందుబాటులో ఉంటుంది. మీ వివరాలను నమోదు చేయాలి. జూన్ 21న నిర్వహించే యోగా కార్యక్రమంలో ఎక్కడ పాల్గొంటారనేది సెలెక్ట్ చేయాలి. ఓటీపీ ప్రాసెస్ తర్వాత… రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
సంబంధిత కథనం