Anganvadi jobs : న్యాయ సమీక్ష తర్వాతే ఉద్యోగాల నియామకం-ap government may cancel anganvadi supervisor recruitment with legal disputes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anganvadi Jobs : న్యాయ సమీక్ష తర్వాతే ఉద్యోగాల నియామకం

Anganvadi jobs : న్యాయ సమీక్ష తర్వాతే ఉద్యోగాల నియామకం

HT Telugu Desk HT Telugu

Anganvadi jobs అంగన్‌ వాడీ సూపర్‌వైజర్‌ ఉద్యోగాల నియామకంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో నోటిఫికేషన్‌ రద్దు చేయాలా, కొనసాగించాలా అనే దానిపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌.అనురాధ ప్రకటించారు. 560 అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్ పోస్టుల భర్తీ వ్యవహారం వివాదాస్పదం కావడంతో అధికారులు వివరణ ఇచ్చారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనురాధ

Anganvadi jobs ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌ వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనురాధ చెప్పారు. పరీక్షల్లో ఎలాంటి అవక తవకలకు ఆస్కారం లేదని, రాత పరీక్షల్లో మార్కులను ఇప్పటికే వెబ్‌సైట్లలో ఉంచామని చెప్పారు. అర్హత, యోగ్యతలకే ప్రాధాన్యత ఇచ్చేలా నియామక ప్రక్రియ చేపట్టినట్టు వివరించారు. పరీక్ష నిర్వహణలో ముఖ్యమంత్రి ఎంతో స్వేచ్ఛను ఇచ్చారని, హైకోర్టు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలను నిలుపుదల చేశామన్నారు.

అంగన్‌ వాడీ Anganvadi jobsసూపర్‌ వైజర్‌ నియామక పరీక్షలపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని, అవసరమైతే మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరమైతే తిరిగి ఈ పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.

రాష్ట్రంలో 55,607 అంగన్‌ వాడీలు Anganvadi jobsఉండగా, 25 అంగన్‌ వాడీ కేంద్రాలకు ఒక సూపర్‌ వైజర్‌ ఉండాల్సి ఉండగా, ఎక్కువ సూపర్‌ వైజర్‌ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల, ఒక్కొక్క సూపర్‌ వైజర్‌ 60 అంగన్‌ వాడీ కేంద్రాల వరకూ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగానున్న 560 అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేన్‌ జారీచేసి భర్తీ ప్రక్రియను చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21,098 అంగన్‌ వాడీ వర్కర్లు, 82 కాంట్రాక్టు సూపర్‌ వైజర్లు ఈ పరీక్షకు హాజరయ్యారు.

రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా అంగన్‌ వాడీల్లో పి.పి.–1 మరియు పి.పి.–2 విధానం అమలు పర్చడం వల్ల పిల్లలకు ఇంగ్లీషును నేర్పించాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకు తగ్గట్టుగా అంగన్‌ వాడీ పిల్లలకు ఇంగ్లీషు రైమ్స్, పధాలు , సెంటెన్సులు చెప్పాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల స్పోకెన్‌ ఇంగ్లీషు నైపుణ్యతను పెంచేందుకు వ్రాత పరీక్షతతో పాటు వారికి స్పోకెన్‌ ఇంగ్లీషు పరీక్ష కూడా నిర్వహించేదుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

అభ్యర్థుల ఇంగ్లీషు నైపుణ్యాన్ని పరీక్షించేందుకు ఇంటర్యూలు నిర్వహిస్తే అభ్యర్థులకు కష్టంగా ఉంటుందనే అలోచనతో 3–5 నిమిషాలు వీడియోను రికార్డు చేసుకొని అప్‌ లోడ్‌ చేయాల్సినదిగా నోటిఫికేషన్లో పొందుపర్చడం జరిగిందన్నారు. 45 మార్కులతో కూడిన మల్టిపుల్‌ ఛాయిస్‌ వ్రాతపరీక్ష తెలుగులో నిర్వహించామని, మరో ఐదు మార్కులు స్పోకెన్‌ ఇంగ్లీషు నైపుణ్యానికి కేటాయించినట్లు చెప్పారు. ఓ.ఎం.ఆర్‌. షీట్‌ లో గుర్తించబడిన సమాధానాలను కంప్యూటర్‌ స్కానర్‌ ద్వారా మార్కులను ఖరారు చేసినట్లు వివరించారు.

అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్‌ పోస్టులు జోనల్‌ స్థాయి పోస్టులని, వాటి భర్తీలో రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌ ను అనుసరించడం జరిగిందన్నారు. వ్రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను రోస్టర్‌ పాయింట్‌ ప్రకారం అంటే ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి., వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో పాటు ఓ.సి. అభ్యర్థులను కూడా ఒక్కొక్క పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున 1:2 విధానంలో అభ్యర్థుల మెరిట్‌ లిస్టులను రూపొందించి మొత్తం 1,194 అభ్యర్థులను స్పోకెన్‌ ఇంగ్లీషు వీడియోలకు ఎంపిక చేసినట్లు చెప్పారు.

అయితే ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియపై కొందరు అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. స్పోకెన్‌ ఇంగ్లీషు ప్రక్రియ ప్రారంభించక ముందే వ్రాత పరీక్ష కీ ఎందుకు వెల్లడి చేయలేదని, మార్కులు ఎందుకు ప్రకటించలేదు అనేవి ముఖ్యంగా వారి సందేహాలు అన్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం మద్యంతర ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో పరీక్షా ఫలితాల ప్రకటనను నిలుపుదల చేయడం జరిగిందన్నారు. అయితే వ్రాత పరీక్ష మార్కులను ఇప్పటికే వెబ్‌ సైట్‌ లో ఉంచడం జరిగిందన్నారు. పరీక్షల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో స్వేచ్ఛను ఇచ్చారని, ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని ముందుకు వెళతామని ఆమె స్పష్టం చేశారు.

అంగన్వాడీ సూపర్ వైజర్ల నియామక నోటిఫికేషన్ రద్దు చేసేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారని, దీనిపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ రద్దు పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అంశాన్ని న్యాయనిపుణులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. హైకోర్టు ఆదేశాలమేరకు ప్రస్తుతం ఫలితాల నిలుపుదల చేసినట్లు చెప్పారు.