అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఉచిత విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్- ప్రతి రైతుకు రూ.85 వేల ఆర్థికసాయం-ap government good news for farmers free electricity connections allowed 85k financial assistance ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఉచిత విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్- ప్రతి రైతుకు రూ.85 వేల ఆర్థికసాయం

అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఉచిత విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్- ప్రతి రైతుకు రూ.85 వేల ఆర్థికసాయం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించింది. ప్రతి రైతుకు రూ.85,000 వరకు ఖర్చు చేసి విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఉచిత విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్- ప్రతి రైతుకు రూ.85 వేల ఆర్థికసాయం

ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్న రైతులకు 50 వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కనెక్షన్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.450 కోట్లు ఖర్చు చేస్తుంది. గత ప్రభుత్వంలో పెండింగ్‌ దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా కొత్త కనెక్షన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త కనెక్షన్లకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్ సామాగ్రి డిస్కంలు సమకూర్చుకుంటున్నాయి.

50 వేల విద్యుత్ కనెక్షన్లు

రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత ప్రభుత్వ సమయంలో రైతులు కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం చేసుకున్నదరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించింది. కొత్త విద్యుత్ కనెక్షన్లను అవసరమయ్యే ట్రాన్స్‌ఫార్మర్లు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, స్తంభాలు, ఇతర సామాగ్రిని డిస్కంలు సిద్ధం చేస్తున్నాయి. ఒక 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ తో ముగ్గురు రైతులకు కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కో కనెక్షన్‌కు సగటున ఐదు స్తంభాలు అవసరం అవుతాయి. అందులో మూడు స్తంభాలు, పరికరాలను డిస్కంలు ఉచితంగా అందిస్తాయి. అదనంగా పరికరాల ఖర్చును రైతులు భరించాల్సి ఉంటుంది.

ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు సగటున రూ.85,000 ఖర్చు అవుతుందని ప్రభుత్వ అంచనా. ప్రతి రైతుకు ట్రాన్స్‌ఫార్మర్ అవసరమైన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఖర్చు రూ.2.5 లక్షలు వరకు ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యుత్ కనెక్షన్‌లతో బోరింగులు నడిపేందుకు, సాగు విస్తృతంగా చేసేందుకు అవకాశం లభించనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో చాలా మంది రైతులు ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ కనెక్షన్లను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రతి రైతుకు 5 హార్స్‌పవర్ మోటారును ఉపయోగించేలా విద్యుత్ కనెక్షన్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.

అర్హులెవరు?

  • ఆంధ్రప్రదేశ్ పరిధిలో నివసించే రైతులు అర్హులు.
  • రైతులు వ్యవసాయ భూమి యాజమాన్య హక్కు ఉండాలి.
  • గతంలో దరఖాస్తు చేసి పెండింగ్‌లో ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
  • 5 హార్స్‌పవర్ మోటార్ వాడుకునే సామర్థ్యం ఉన్న రైతులు

రైతులు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు

  • ఆధార్ కార్డు జిరాక్స్
  • భూమి పట్టాదారు డాక్యుమెంట్లు లేదా యాజమాన్య హక్కు పత్రాలు
  • రైతు గుర్తింపు కార్డు
  • బ్యాంక్ ఖాతా వివరాలు
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో

దరఖాస్తు విధానం

  • ఏపీ ప్రభుత్వం పేర్కొన్న అర్హతలను కలిగిన వారు
  • ప్రభుత్వం పేర్కొన్న డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోండి.
  • స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి.
  • అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి.
  • ఫారం సబ్మిట్ చేయండి.

అయితే గతంలో దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం ఈ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం డిస్కంలకు అనుమతులు ఇచ్చింది. 85 వేల ఖర్చుతో ప్రతి రైతుకు ఉచిత విద్యుత్ కనెక్షన్ అందించింది.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం