కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఏడాది పాటు సర్వీస్ పొడిగింపు-ap government good news for contract employees service extension for one year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఏడాది పాటు సర్వీస్ పొడిగింపు

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఏడాది పాటు సర్వీస్ పొడిగింపు

ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక శాఖ అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను మార్చి 30, 2026 వరకు పొడిగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఏడాది పాటు సర్వీస్ పొడిగింపు

ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ముగిసిపోయాయి. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను 2026 ఏడాది మార్చి 30వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొంది.

ఆర్థికశాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి

ఆర్థికశాఖ అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే సేవల పొడిగింపు వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో పాటు జిల్లాల్లో వందలాది మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న విషయం తెలిసింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం