ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటనను జారీ చేసింది. మొత్తం 488 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు.
ఈ పోస్టులను రెగ్యూలర్ బేస్ విధానంలోనే భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 9వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://dme.ap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
ఉద్యోగ ప్రకటన - డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్యారోగ్యశాఖ.
ఉద్యోగ ఖాళీల సంఖ్య - 488
భర్తీ చేసే ఉద్యోగాలు - అసిస్టెంట్ ప్రొఫెసర్
అర్హతలు - మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/DM) ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
దరఖాస్తు విధానం - ఆన్లైన్
దరఖాస్తు రుసుం - ఓసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి.
దరఖాస్తుకులకు తుది గడువు - 09.09.2024
అధికారిక వెబ్ సైట్ - https://dme.ap.nic.in/
ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ - https://dmeaponline.com/
ఇటీవలనే ఏపీ వైద్యారోగ్య శాఖ ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. డీఎంఈ(డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోని వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఖాళీలను భర్తీ చేయనుంది. అన్ని పోస్టులు కలిపి 997 ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఈ నోటిఫికేషన్ లో చూస్తే సీనియర్ రెసిడెంట్ (క్లినికల్) పోస్టులు 425 ఉండగా… సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్) ఉద్యోగాలు 479 ఉన్నాయి. ఇక సూపర్ స్పెషాలిటీ కింద 93 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 997గా ఉంది.