సింహాచలం ఆలయ ప్రమాద మృతులకు రూ.25లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు-ap cm chandrababu naidu announces rs 25 lakh compensation for those killed in simhachalam temple accident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సింహాచలం ఆలయ ప్రమాద మృతులకు రూ.25లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు

సింహాచలం ఆలయ ప్రమాద మృతులకు రూ.25లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు

Sarath Chandra.B HT Telugu

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.3లక్షలు సాయం అందిస్తారు.

ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం తెల్ల వారుజామును రిటైనింగ్‌ వాల్‌ కూలి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం సీఎం మంత్రులు, అధికారులతో చర్చించారు.

ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపి భరత్, సింహాచలం దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు.

ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్న సిఎం మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సిఎం ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.