CBN In Davos: జ్యూరిచ్‌ చేరుకున్న ఏపీ సీఎం..ఎయిర్‌ పోర్ట్‌లో రేవంత్‌తో భేటీ.. బాబు బృందంలో నారా బ్రాహ్మణి-ap cm arrives in zurich meet revanth at the airport nara brahmani in babus team ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn In Davos: జ్యూరిచ్‌ చేరుకున్న ఏపీ సీఎం..ఎయిర్‌ పోర్ట్‌లో రేవంత్‌తో భేటీ.. బాబు బృందంలో నారా బ్రాహ్మణి

CBN In Davos: జ్యూరిచ్‌ చేరుకున్న ఏపీ సీఎం..ఎయిర్‌ పోర్ట్‌లో రేవంత్‌తో భేటీ.. బాబు బృందంలో నారా బ్రాహ్మణి

HT Telugu Desk HT Telugu
Jan 20, 2025 01:48 PM IST

CBN In Davos: ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం దావోస్‌ చేరుకుంది. మంత్రులు, అధికారులతో కూడిన ఈ బృందంలో నారా లోకేష్‌ సతీమణి బ్రాహ్మణి కూడా కనిపించారు. అధికారికంగా దావోస్‌లో పర్యటించే వారి జాబితాలో బ్రాహ్మణి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

జ్యూరిచ్ విమానాశ్రయంలో నారా బ్రాహ్మణి
జ్యూరిచ్ విమానాశ్రయంలో నారా బ్రాహ్మణి

CBN In Davos: ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ చేరుకున్నారు దావోస్‌కు తన పర్యటనలో మొదటి రోజున, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టి.జి. భరత్ ఇతర అధికారుల బృందం సోమవారం ఉదయం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

yearly horoscope entry point

విమానాశ్రయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రులను యూరప్ టిడిపి ఫోరం సభ్యులు, భారతీయ ప్రవాసులు  స్వాగతించారు. ప్రవాసాంధ్రులను చంద్రబాబు అప్యాయంగా పలకరించారు. సోమవారం సీఎం చంద్రబాబు మరియు మంత్రులు జ్యూరిచ్‌లో పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు.

ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌ చేరుకున్న  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జ్యూరిచ్ విమానాశ్రయంలో సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు వివిధ పెట్టుబడి అవకాశాల గురించి వారు చర్చించారు. ఈ భేటీలో తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. 

విదేశీ పర్యటనలో నారా బ్రాహ్మణి..

ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలో కోడలు నారా బ్రాహ్మణి కూడా కనిపించారు. జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులు స్వాగతం పలుకుతున్న సమయంలో వీడియోల్లో బ్రాహ్మణి కనిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎకనామిక్ ఫోరం సదస్సుల్లో పాల్గొంటున్న అధికారిక జాబితాలో బ్రాహ్మణి పేరు లేదు. మంత్రుల బృందంలో నారా లోకేష్‌, టీజీ భరత్‌ తదితరులు ఉన్నారు.

Whats_app_banner